MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీ రికార్డు బ్రేక్ చేసిన హర్మన్‌ప్రీత్... కోహ్లీ రికార్డును సమం చేసిన స్మృతి మంధాన...

ధోనీ రికార్డు బ్రేక్ చేసిన హర్మన్‌ప్రీత్... కోహ్లీ రికార్డును సమం చేసిన స్మృతి మంధాన...

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్‌ని 8 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా, 38 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ని ముగించేసింది. ఈ విజయంతో భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా నిలిచింది...

1 Min read
Chinthakindhi Ramu
Published : Jul 31 2022, 07:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హర్మన్‌ప్రీత్ కౌర్‌కి టీ20 కెప్టెన్‌గా ఇది 42వ విజయం. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ 41 టీ20 మ్యాచుల్లో విజయాలు అందుకోగా, విరాట్ కోహ్లీ 30 విజయాలు అందుకున్నాడు. ప్రస్తుత సారథి రోహిత్ శర్మ 27 విజయాలతో టాప్ 4లో ఉన్నాడు...

26
Image credit: PTI

Image credit: PTI

ఇండియా, పాక్ వుమెన్స్ టీ20 మ్యాచుల్లో బంతుల వారీగా ఇదే అతి పెద్ద విజయం. పాక్ జట్టు 99 పరుగులకే ఆలౌట్ అయినా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌ని 38 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ని ముగించింది భారత జట్టు. 

36

ఇంతకుముందు 2018లో జరిగిన మ్యాచ్‌లో 23 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది టీమిండియా...
లక్ష్యఛేదనలో 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసిన స్మృతి మంధాన, వుమెన్స్ టీ20 ఛేదనలో 1000+ పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా నిలిచింది...
 

46
Harmanpreet Kaur

Harmanpreet Kaur

ఇంతకుముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ టీ20 ఛేజింగ్‌లో 977 పరుగులు చేయగా, ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 830 పరుగులతో మూడో స్థానంలో ఉంది.. ఈ రికార్డులో విరాట్ కోహ్లీ 1789 పరుగులతో టాప్‌లో ఉన్నాడు...

56

టీమిండియా మెన్స్ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 1375 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. స్మృతి మంధాన 1059 పరుగులతో టాప్ 3లో ఉంది. లక్ష్యఛేదనలో టీ20ల్లో 1000+ పరుగులు అందుకున్న మొదటి మెన్స్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాగా స్మృతి మంధాన మొదటి వుమెన్స్ క్రికెటర్...

66

పాకిస్తాన్‌తో ఆఖరి మ్యాచ్‌లో వన్డేల్లో, టీ20ల్లో హాఫ్ సెంచరీ చేసిన మెన్స్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలవగా, వుమెన్స్ క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఈ ఇద్దరి జెర్సీ నెంబర్ 18 కావడం విశేషం.. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
Recommended image2
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !
Recommended image3
Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్‌ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved