MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Hardik pandya: శిఖర్ ధావన్ ను అధిగమించిన హార్దిక్ పాండ్యా

Hardik pandya: శిఖర్ ధావన్ ను అధిగమించిన హార్దిక్ పాండ్యా

Hardik Pandya: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ బ్యాటర్ శిఖర్ ధావన్‌ను అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ప్లేయర్ గా నిలిచాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 01 2025, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit: Getty Images

Image Credit: Getty Images

పూణేలో ఇంగ్లాండ్ తో జరిగిన  నాల్గో టీ20 మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ గెలుపుతో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతను భారత మాజీ బ్యాటర్ శిఖర్ ధావన్‌ను అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ భారత క్రికెటర్ గా నిలిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit: Getty Images

Image Credit: Getty Images

టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన 5వ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా

పూణేలో శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టీ20లో పాండ్యా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేసి, జట్టును 79/5 స్థితి నుంచి 20 ఓవర్లలో 181/9కి చేర్చాడు. అతని పరుగులు 155 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో వచ్చాయి. ఇప్పుడు 113 టీ20లు, 89 ఇన్నింగ్స్‌లలో హార్దిక్ పాండ్యా 28.17 సగటుతో, 141.63 స్ట్రైక్ రేట్‌తో 1,803 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 71* పరుగులు.

ఇప్పుడు హార్దిక్ పాండ్యా శిఖర్ ధావన్ ను అధిగమించాడు. 68 మ్యాచ్‌లలో ధావన్ 27.92 సగటుతో, 126.36 స్ట్రైక్ రేట్‌తో 1,759 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 92 పరుగులు. తన 66 ఇన్నింగ్స్‌లలో 11 అర్ధ సెంచరీలు సాధించాడు. 

35

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ ఎవరు? 

టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు మాజీ టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మ. అతను 159 మ్యాచ్‌లు, 151 ఇన్నింగ్స్‌లలో 32.05 సగటుతో, 140.89 స్ట్రైక్ రేట్‌తో 4,231 పరుగులు చేశాడు. అతను ఐదు సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 121* పరుగులు.

అతని తర్వాత విరాట్ కోహ్లీ (125 మ్యాచ్‌లలో 48.69 సగటుతో 4,188 పరుగులు, ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు), సూర్యకుమార్ యాదవ్ (82 మ్యాచ్‌లు, 78 ఇన్నింగ్స్‌లలో 38.74 సగటుతో 2,596 పరుగులు, నాలుగు సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు) ఉన్నారు.

45
Hardik Pandya

Hardik Pandya

IND vs ENG: ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ 

మ్యాచ్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పేసర్ సాకిబ్ మహ్మూద్ (3/35) సంజు శాంసన్, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లను ఒకే ఓవర్లోఔట్ చేయడంతో భారత్ 12/3 స్థితికి చేరుకుంది. అయితే, ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ (19 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 29 పరుగులు), రింకు సింగ్ (26 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంలో భారత్ 79/5 పరుగులకు చేరుకుంది.

ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు), శివమ్ దూబే (30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు) మధ్య 87 పరుగుల భాగస్వామ్యంతో భారత్ 20 ఓవర్లలో 181/9 పరుగులు చేసింది. ఓవర్టన్ (4/32), ఆదిల్ రషీద్ (1/35) మంచి బౌలింగ్ తో ఆకట్టుకున్నారు.

55

182 పరుగుల టార్గెట్ లో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ కు మంచి శుభారంభం లభించింది. ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు), బెన్ డకెట్ (19 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు) ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే, భారత స్పిన్నర్లు రాణించడంతో భారత్ మ్యాచ్ ను తన వైపు లాక్కుంది. 

ఇంగ్లాండ్‌ను 95/4 పరుగులతో ఉన్న సమయంలో హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 పరుగులు) అర్ధ సెంచరీ సాధించాడు, కానీ మరోవైపు వికెట్లు వేగంగా పడ్డాయి. హర్షిత్ (3/33), స్పిన్నర్ రవి బిష్ణోయ్ (3/28) అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టారు. దీంతో ఇంగ్లాండ్ 166 పరుగులకే పరిమితమై 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. శివం దూబే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. భారత్ ఈ సిరీస్‌ను 3-1తో గెలుచుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Recommended image3
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved