టీమిండియాను వెంటాడుతున్న నాలుగు సమస్యలు... ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి ముందు...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీ పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచి, రెట్టింపు ఉత్సాహంతో ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా, ఫైనల్ మ్యాచ్లో షాక్ తగిలింది. ఫైనల్లో టీమిండియా అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యి, న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో చిత్తు అయ్యింది....
ఇంగ్లాండ్లోని సౌంతిప్టన్ వాతావరణం, అక్కడి పరిస్థితులు న్యూజిలాండ్కి అనుకూలిస్తాయని,ఫైనల్లో టీమిండియా గెలవడం కష్టమేనని ముందుగానే అంచనా వేసినా... ఫైనల్లో భారత ఆటతీరు మరీ నిరుత్సాహంగా సాగింది...
ఇంగ్లాండ్తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్కి ముందు భారత జట్టును ప్రధానంగా నాలుగు సమస్యలు వెంటాడుతున్నాయి. వీటిపైన ఫోకస్ పెడితే, ఇంగ్లాండ్ను ఇంగ్లాండ్ గడ్డ మీద ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు..
స్వింగ్ లేని భారత బౌలింగ్: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత పేసర్లు, స్వింగ్ రాబట్టలేకపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లు 2.9 డిగ్రీల కోణంలో స్వింగ్ చేస్తే, భారత జట్టు తరుపున ఇషాంత్ శర్మ అత్యధికంగా 0.9 డిగ్రీల స్వింగ్ రాబట్టాడు...
భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ అయితే కేవలం 0.6 డిగ్రీల కోణంలో మాత్రమే స్వింగ్ చేయగలిగారు. ఇంగ్లాండ్ పిచ్లు స్వింగ్కి అనుకూలిస్తాయి. కాబట్టి భారత జట్టు స్వింగ్ అస్త్రాన్ని పదును పెట్టాల్సిన అవసరం ఉంది...
భారత స్టార్ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ని ఇంగ్లాండ్ టూర్కి ఎంపిక చేయకుండా భారీ మూల్యం చెల్లించుకున్న టీమిండియా, అందుబాటులో ఉన్న స్వింగ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ను సరిగ్గా వాడుకోవాలి...
ఛతేశ్వర్ పూజారా బ్యాటింగ్: భారత జట్టుకి టెస్టుల్లో వెన్నెముక లాంటి బ్యాట్స్మెన్ ఛతేశ్వర్ పూజారా. అయితే దాదాపు రెండున్నరేళ్లుగా పూజారా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు..
డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో 8, రెండో ఇన్నింగ్స్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరిన ఛతేశ్వర్ పూజారా, ఫామ్ను అందుకోవడం ఇప్పుడు టీమిండియాకి అత్యంత అవసరం...
టెయిల్ బ్యాటింగ్: భారత జట్టు టెయిలెండర్లు బ్యాటింగ్లో ఏ మాత్రం పరుగులు చేర్చలేకపోతున్నారు. న్యూజిలాండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయిన తర్వాత తొలి ఇన్నింగ్స్లో 61 పరుగులు జోడిస్తే, భారత జట్టు టెయిలెండర్లు జోడించింది రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కూడా ఇంత లేదు...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీలో న్యూజిలాండ్ టెయిలెండర్లు 19.96 సగటుత పరుగులు చేస్తే, ఆస్ట్రేలియా 16.64, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్ ఆ తర్వాతి వరుసలో ఉన్నారు...
భారత జట్టు టెయిలెండర్లు కేవలం 8.97 సగటుతో పరుగులు సాధించారు. బంగ్లాదేశ్ 7.18 మాత్రమే భారత జట్టు కంటే ఘోరమైన ప్రదర్శన ఇచ్చింది...
మిడిల్ ఆర్డర్ వైఫల్యం: తొలి ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు తొలి వికెట్కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే ఆ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు రాలేదు...
రెండో ఇన్నింగ్స్లో అయితే ఓపెనర్లు అవుటైన వెంటనే ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే పెవిలియన్కి క్యూ కట్టారు. మిడిల్ ఆర్డర్ వైఫల్యంపై టీమిండియా ఫోకస్ పెట్టాల్సి అవసరం ఉంది.