MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియాకి నిరాశ... వర్షం కారణంగా డ్రాగా ముగిసిన మొదటి టెస్టు...

టీమిండియాకి నిరాశ... వర్షం కారణంగా డ్రాగా ముగిసిన మొదటి టెస్టు...

టీమిండియా ఫ్యాన్స్ భయపడిందే జరిగింది. ఎడతెడపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఐదో రోజు ఆట రద్దయ్యింది. దీంతో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 08 2021, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చేతిలో 9 వికెట్లు ఉండడం, విజయానికి 157 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండడంతో టీమిండియా విజయంతో సిరీస్‌ను మొదలెడుతుందని అనుకున్నారు టీమిండియా ఫ్యాన్స్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎప్పుడూ వెంటాడే బ్యాడ్‌లక్, విజయం ముంగిట మరోసారి వర్షం రూపంలో పలకరించింది. నాటింగ్‌హమ్‌లో ఆదివారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది...

38

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 183 పరుగులకి ఆలౌట్ కాగా, టీమిండియా 278 పరుగులు చేసింది. భారత జట్టులో కెఎల్ రాహుల్ 84 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 56, రోహిత్ శర్మ 36, బుమ్రా 28 పరుగులు చేశారు...

48

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 303 పరుగులు చేసింది. జో రూట్ 109 పరుగులు చేయగా, సామ్ కుర్రాన్ 32, బెయిర్‌స్టో 30 పరుగులు చేశాడు...

58

జస్ప్రిత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 209 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది...  

68

ఆఖరి రోజు 157 పరుగులు కావాల్సి ఉండగా వర్షం కారణంగా తొలి సెషన్, ఆ తర్వాత రెండో సెషన్ పూర్తిగా రద్దయ్యింది. ఆఖరి సెషన్‌లో అయినా ఆట సాధ్యమవుతుందని విరాట్ కోహ్లీ అండ్ టీమ్ ఎదురుచూసింది.

78

అయితే టీ బ్రేక్ తీసుకున్న తర్వాత కూడా వర్షం తగ్గకపోవడం, పిచ్ చిత్తడిగా మారడంతో ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు...

88

ఐసీసీ డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో జరుగుతున్న మొట్టమొదటి సిరీస్ ఇది. మొదటి మ్యాచ్ డ్రా కావడంతో ఇరు జట్లకూ నాలుగేసి పాయింట్లు లభించాయి...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved