ఫీల్డింగ్ టెస్టు పాస్ కాకపోతే, విరాట్ కోహ్లీనైనా పక్కన పెట్టేయాలి... మహ్మద్ కైఫ్ సూచన...
First Published Dec 28, 2020, 6:08 AM IST
టీమిండియాకి జాంటీ రోడ్స్ లాంటి టాప్ క్లాస్ స్టార్ ఫీల్డర్ మహ్మద్ కైఫ్. ఎన్నో అద్బుతమైన క్యాచులను అందుకున్న కైఫ్, వెనక్కి పరుగెడుతూ క్యాచులు అందుకుని 15 ఏళ్ల క్రిందటే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశాడు. భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగవ్వడానికి కైఫ్ కూడా ప్రధాన కారణం. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్లో భారత జట్టు క్యాచులు జారవిడుస్తోంది. వన్డే, టీ20 సిరీస్లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ కూడా క్యాచులు జారవిడిచాడు.

తొలి టెస్టులో భారత ఫీల్డర్లు జారవిడిచిన క్యాచులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది టీమిండియా. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, బుమ్రా క్యాచులు వదిలేయడంతో లబుషేన్, టిమ్ పైన్ మంచి స్కోర్లు చేశారు.

భారత జట్టు ఫీల్డింగ్పై హాట్ కామెంట్లు చేశాడు మహ్మద్ కైఫ్. భారత జట్టు ఫీల్డింగ్ చాలా మెరుగయ్యిందని చెప్పిన మహ్మద్ కైఫ్, బ్యాటింగ్, బౌలింగ్ టెస్టులాగే ఫీల్డింగ్ టెస్టు కూడా పెట్టాలని అన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?