ధోనీ ఫేమస్ డైలాగ్తో ఆర్సీబీని ట్రోల్ చేసిన మహిళా క్రికెటర్... కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం..
IPL 2020 సీజన్లోనూ రాయల్ ఛాలెంజర్స్ ప్రయాణం టైటిల్ దాకా సాగలేదు. గత సీజన్ కంటే కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చిన ఆర్సీబీ... నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అదృష్టవశాత్తు ప్లేఆఫ్ చేరుకున్నా, కీలక మ్యాచ్లో ఓడి ప్రస్థానం మధ్యలోనే ఆపింది. మొదటి క్వాలిఫైయర్ అనంతరం ఓ మహిళా క్రికెటర్ వేసిన ట్వీట్ వైరల్గా మారింది.
13 సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ప్రతీ సీజన్లోనూ బెంగళూరు ఈసారి కప్పు కొడుతుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూడడం.. ఆర్సీబీ వారి ఆశలను అడియాశలు చేయడం జరుగుతూనే ఉంది.
తాజాగా శుక్రవారం జరిగిన మొదటి ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
ఈ పరాజయం తర్వాత ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు ఆర్సీబీని ట్రోల్ చేస్తూ ట్వీట్లు చేయడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపక్ అయ్యింది...
ఇంగ్లాండ్ మహిళా జట్టు క్రికెటర్ అలెగ్జాండ్రియా హార్ట్లే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వీరాభిమాని... ఆర్సీబీ ప్లేఆఫ్స్ నుంచే నిష్కమించడంతో తీవ్రంగా నిరుత్సాహపడింది అలెగ్జాండ్రియా.
‘మనం ఎప్పుడైనా టైటిల్ గెలుస్తామా?’ అంటూ ఏడుస్తున్నట్టుగా ఎమోజీని ట్వీట్ చేసింది అలెగ్జాండ్రియా. దీనికి రిప్లై ఇచ్చిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ కేట్ క్రాస్... ధోనీ ఫేమస్ డైలాగ్ ‘కచ్ఛితంగా కాదు’ (Definitely Not) అంటూ కౌంటర్ ఇచ్చింది.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన చివరి గ్రూప్ మ్యాచ్కి ముందు కామెంటేటర్ డానీ మోరిసన్... ‘ఎల్లో జెర్సీలో మీకిది చివరి మ్యాచ్ అనుకోవచ్చా’ అని అడిగిన ప్రశ్నకి ధోనీ... ‘డెఫినెట్లీ నాట్’ అంటూ సమాధానం ఇచ్చాడు.
ఆర్సీబీ ఎప్పటికీ టైటిల్ గెలవలేదని ట్రోల్ చేసిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ కేట్పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. వచ్చే ఏడాది కచ్ఛితంగా ఆర్సీబీ కప్పు కొడుతుందని, అప్పటిదాకా వేచి చూడాలని కామెంట్లు చేస్తున్నారు..
ధోనీ ఇచ్చిన ఈ సమాధానం చాలా పాపులర్ అయ్యింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయం తర్వాత చాలామంది ఇదే డైలాగ్తో కోహ్లీ జట్టును ట్రోల్ చేస్తున్నారు.
2020 సీజన్లో ధోనీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోగా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.