ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ ఆలీకి కరోనా పాజిటివ్... లంక సిరీస్లో ఇంగ్లీష్ టీమ్కి...
ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ ఆలీ కరోనా బారిన పడ్డాడు. రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక చేరిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయగా మొయిన్ ఆలీకి పాజిటివ్ వచ్చింది. అతనితో కలిసి ప్రయాణం చేసిన ఇంగ్లాండ్ జట్టు మొత్తం క్వారంటైన్లోకి వెళ్లింది. ముఖ్యంగా మొయిన్ ఆలీ పక్కనే కూర్చున్న పేసర్ క్రిస్ వోక్స్ని ఐసోలేషన్కి తరలించారు అధికారులు.
ఇంగ్లాండ్ నుంచి లంక టూర్కి బయలుదేరేముందు జట్టు మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.
ఈ పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అయితే శ్రీలంకలో పరీక్షలు చేయగా మొయిన్ ఆలీకి పాజిటివ్ వచ్చింది.
కరోనా పాజిటివ్ రావడంతో మొయిన్ ఆలీ 10 రోజుల పాటు ఐసోలేషన్లో గడపాల్సి ఉంటుంది...
ఆ తర్వాత కరోనా పరీక్షలో నెగిటివ్ ఫలితం వస్తే తిరిగి జట్టుతో కలిసేందుకు అవకాశం ఉంటుంది.
జనవరి 14 నుంచి శ్రీలంకతో మొదటి టెస్టు ఆడనుంది ఇంగ్లాండ్ జట్టు. దీంతో మొదటి టెస్టుకి మొయిన్ ఆలీ దూరం కానున్నాడు.
శ్రీలంక టూర్ను జనవరి 26న ముగించుకుని, అటు నుంచి ఇండియాకు రానుంది ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు...
ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్తో స్వదేశంలో నాలుగు టెస్టులు, ఐదు టీ20 మ్యాచులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది టీమిండియా...
ప్రస్తుతం సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ఆడుతున్న శ్రీలంక... మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది...
రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 157 పరుగులకే ఆలౌట్ అయ్యింది శ్రీలంక.