MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • రిషబ్ పంత్ మాస్కులో అభిమానులకు సెల్ఫీలు ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ... డ్రెస్సింగ్ రూమ్‌లో...

రిషబ్ పంత్ మాస్కులో అభిమానులకు సెల్ఫీలు ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ... డ్రెస్సింగ్ రూమ్‌లో...

కెప్టెన్‌గా ఇంకా ఏమీ సాధించలేకపోయినా టెస్టుల్లో బ్యాటర్‌గా మాత్రం గురువుని మించిన శిష్యుడిలా మారిపోయాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. తన దూకుడైన ఆటతీరుతో తక్కువ సమయంలోనే స్టార్ ప్లేయర్‌గా మారిపోయాడు పంత్. తాజాగా భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ... రిషబ్ పంత్ మాస్కుతో భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కి రావడం హాట్ టాపిక్ అయ్యింది...

1 Min read
Chinthakindhi Ramu
Published : Jul 10 2022, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బర్త్ డే, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌కి వెళ్లాడు మహేంద్ర సింగ్ ధోనీ. లండన్‌లో బర్త్ డే పార్టీ చేసుకున్న మాహీ, ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఉన్న మూడో టీ20 కోసం సన్నద్ధమవుతున్న భారత జట్టును కలిశాడు.. 

27
Image credit: BCCI

Image credit: BCCI

బయో బబుల్ నిబంధనలు అమలులో లేకపోవడంతో భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, భారత జట్టును కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో రిషబ్ పంత్‌, ఇషాన్ కిషన్, తదితర సహాయక సిబ్బందితో కలిసి కాసేపు ముచ్ఛటించాడు...

37
Image credit: BCCI

Image credit: BCCI

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సెంచరీ చేసి అదరగొట్టిన రిషబ్ పంత్, ఆ తర్వాత లండన్ చేరుకుని తన ఐడెల్ మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు... ఇప్పుడు స్వయంగా మాహీయే రిషబ్ పంత్ మాస్కులో డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.. 

47
Image credit: Getty

Image credit: Getty

భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌తో భారత జట్టుకి మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన వికెట్ కీపర్‌గా మారాడు రిషబ్ పంత్. ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన రిషబ్ పంత్, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు...
 

57
Image credit: PTI

Image credit: PTI

ఎమ్మెస్ ధోనీ వారసుడిగా రిషబ్ పంత్‌ని ప్రమోట్ చేస్తూ వచ్చింది బీసీసీఐ. ఆరంభంలో ఎన్ని మ్యాచుల్లో విఫలమైనా రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇవ్వడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి... 

67

రిషబ్ పంత్‌కి ఇన్ని అవకాశాలు ఇచ్చే బదులు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రీకర్ భరత్ వంటి వేరే వికెట్ కీపర్లను వాడుకోవాలనే వాదనలు వినిపించాయి. ఆరంభంలో పంత్‌ని ఎమ్మెస్ ధోనీతో పోల్చి చూస్తూ అభిమానులు గేలి చేసేవాళ్లు...

77

అయితే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీకి సరైన వారసుడిగా మారిన రిషబ్ పంత్, తనకంటూ టీమ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విదేశాల్లో కూడా అదరగొడుతూ మాహీ రికార్డులు కూడా బ్రేక్ చేస్తున్నాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
కెప్టెన్‌గా రోహిత్.. గిల్, అయ్యర్, బుమ్రాలకు నో ప్లేస్.! 2025 బెస్ట్ వన్డే జట్టు ఇదిగో..
Recommended image2
Hardik Pandya Girlfriend మహికా శర్మ ఒక్కనెల సంపాదన ఎంత..? ఆస్తులెన్నో తెలుసా?
Recommended image3
టీ20ల్లో గిల్ పాలిట విలన్ ఎవరో కాదు హిట్‌మ్యానే.. ధోని ఫ్రెండ్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved