DCvsMI: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... మళ్లీ అదే నిర్ణయం తీసుకున్న రోహిత్ శర్మ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్...
ముగ్గురు విదేశీ ప్లేయర్లతో బరిలో దిగుతున్న ముంబై ఇండియన్స్... ఆడమ్ మిల్నే స్థానంలో జయంత్ యాదవ్కి చోటు...
IPL 2021 సీజన్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకే ఎక్కువ విజయాలు దక్కాయి.
గత రెండు మ్యాచుల్లో ఛేజింగ్ చేసి విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై మధ్య మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా సాగనుంది.
గత సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన నాలుగు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. గత ఏడాది క్వాలిఫైయర్తో పాటు ఫైనల్లో ముంబై చేతుల్లో ఓడిన ఢిల్లీ, ఈ మ్యాచ్లో గెలిచి కొద్దిగా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
మరో వైపు గత రెండు మ్యాచుల్లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ మంచి అద్భుతమైన విజయాలు అందుకుంది ముంబై ఇండియన్స్. అయితే బ్యాటింగ్లో మాత్రం స్థాయికి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది డిఫెండింగ్ ఛాంపియన్...
ముంబై ఇండియన్స్ జట్టు: డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్, జయంత్ యాదవ్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత, రిషబ్ పంత్, స్టోయినిస్, హెట్మయర్, లలిత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్