CSKvsRR: నేటి మ్యాచ్లో చెన్నై గెలిచి తీరుతుంది... ఇదిగో సాక్ష్యం...
IPL 2020లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. తొమ్మిది మ్యాచుల్లో మూడేసి విజయాలతో ఉన్న ఈ రెండు జట్లకీ నేటి మ్యాచ్ గెలవడం చాలా కీలకం. అయితే నేటి మ్యాచ్లో సీఎస్కే గెలిచి తీరుతుంది అంటున్నారు ధోనీ ఫ్యాన్స్...
మొదటి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మూడో విజయం కోసం చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది.
ఎట్టకేలకు సన్రైజర్స్ హైదరాబాద్పై మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత ఢిల్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులలో ఓడింది...
దీంతో రాజస్థాన్ నేటి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది... మరోవైపు ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతోంది చెన్నై సూపర్ కింగ్స్...
అయితే ఈరోజు మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందని అంటున్నారు ధోనీ ఫ్యాన్స్. ఇదిగో సాక్షమంటూ రికార్డులు కూడా చూపిస్తున్నారు...
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన గత 9 మ్యాచుల్లో మూడు మాత్రమే గెలిచింది ఆర్ఆర్. 6 మ్యాచుల్లో ధోనీ జట్టుకి విజయం దక్కింది.
అయితే రాజస్థాన్ ఒక్క మ్యాచ్ గెలిస్తే, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో సీఎస్కేకి విజయం దక్కింది. ఇలా తొమ్మిది మ్యాచులుగా సింక్ కొనసాగుతోంది.
ఈ సీజన్లో చెన్నై, రాజస్థాన్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. దీంతో నేటి మ్యాచ్తో పాటు ఇంకో మ్యాచ్ కూడా ధోనీ సేనదే అంటున్నారు అభిమానులు.
అయితే ఐపీఎల్ 2020లో ఇలాంటి సెంటిమెంట్లు, రికార్డులన్నీ మారిపోయాయి.
ఇప్పటివరకూ 170+ స్కోరు చేధనలో ముంబైపై గెలవని పంజాబ్, ఆ రికార్డును తిరగరాసింది. ఇలాంటివి 2020 సీజన్లో ఎన్నో...
నేటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే, రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ఫ్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోవాల్సిందే... ఇందులో పెద్ద కొత్తేమీ ఉండదు.
కానీ రాజస్థాన్ రాయల్స్ గనుక గెలిస్తే, ఆడిన 10 సీజన్లలో ఫ్లేఆఫ్స్ చేరిన ఒకే ఒక్క జట్టుగా ఉన్న సీఎస్కే, ఈ సారి ఆ ఫీట్ సాధించలేదు...