MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • Champions Trophy Final: ఇండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు.? ఒకవేళ వర్షం పడితే..

Champions Trophy Final: ఇండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు.? ఒకవేళ వర్షం పడితే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 9వ తేదీ జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌ మ్యాచ్‌ను ఉచితంగా ఎక్కడ చూడొచ్చు.? ఒకవేళ ఆదివారం వర్షం పడితే ఏం జరుగుతుంది.? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 06 2025, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా, దక్షిణాఫ్రిక భారీ విజయాన్ని నమోదు చేసుకొని న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌లో ఉచితంగా చూసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీలో చూడాలంటే మాత్రం కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్‌ ఉండాల్సిందే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నిజానికి అంతకు ముందు జియో సినిమాలో ఉచితంగా మ్యాచ్‌ చూసే అవకాశం ఉండేది. అయితే ఎప్పుడైతే జియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనమై జియోస్టార్‌గా మారిన తర్వాత ఉచిత సేవలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. దీంతో ఓటీటీలో మ్యాచ్‌ చూడాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే మ్యాచ్‌ను ఉచితం వీక్షించే అవకాశం కూడా ఉందని మీకు తెలుసా.? ఇంతకీ మ్యాచ్‌ ఫ్రీ స్ట్రీమింగ్ ఆప్షన్‌ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

34

వెబ్‌సైట్‌ ద్వారా: 

* ఇందుకోసం మీకు యాక్టివ్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌ ఉంటే చాలు. ముందుగా వెబ్‌ బ్రౌజర్‌లోకి వెళ్లి 'firstball.in' అని టైప్‌ చేయాలి. 

* ఆ తర్వాత మొదట కనిపిస్తే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే ఏయే మ్యాచ్‌లు లైవ్‌లో ఉన్నాయో కనిపిస్తుంది. 

* 'వాచ్‌' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే చాలు. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ లేకుండా ఎంచక్కా ఉచితంగా మ్యాచ్‌లను చూడొచ్చు. అయితే ఇందులో మధ్య మధ్యలో యాడ్స్‌ వస్తుంటాయి. 

యాప్‌ కూడా:

అయితే యాడ్స్‌ లేకుండా ఉచితంగా మ్యాచ్‌లు వీక్షించాలనుకుంటే అందుకోసం కూడా ఒక యాప్‌ అందుబాటులో ఉంది. ఇందుకోసం ప్లే స్టోర్‌ నుంచి CRICFy TV అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏలాంటి యాడ్స్‌ లేకుండా మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు. 

44

వర్షం పడితే ట్రోఫీ ఎవరికీ.? 

మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం పడితే ఎలా అనే సందేహం రావడం సర్వసాధారణం. అందులోనూ ఫైనల్ మ్యాచ్‌ కావడంతో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం దుబాయ్‌లో ఆదివారం వర్షం పడే అవకాశం లేదు. ఒకవేళ పొరపాటు వర్షం కురిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐసీసీ నింబంధనల ప్రకారం..  భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం పడితే, రిజర్వ్ డే ఏర్పాటు చేసుకునే నిబంధన ఉంది. దీనిలో ఆట మొదటి రోజు ఆగిపోయిన చోటు నుంచి రెండో రోజు ఆట ప్రారంభమవుతుంది. ఒకవేళ డీఎల్‌ఎస్‌ ఆధారంగా ఫలితాన్ని ప్రకటించాలంటే మ్యాచ్‌లో కనీసం 25 ఓవర్లు పడాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యాచ్‌ టై అయితే సూపర్‌ ఓవర్‌కు అవకాశం కల్పిస్తారనే విషయం తెలిసిందే. మరి ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఏం జరగనుంది.? ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ కానున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved