MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2022: వేలానికి వేళాయే.. ఫిబ్రవరిలో ఐపీఎల్ మెగా యాక్షన్..? హైదరాబాద్ ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే..

IPL 2022: వేలానికి వేళాయే.. ఫిబ్రవరిలో ఐపీఎల్ మెగా యాక్షన్..? హైదరాబాద్ ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే..

IPL Mega Auction:  క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలాన్ని  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సన్నాహాలు చేస్తున్నది. 

2 Min read
Author : Srinivas M
Published : Dec 22 2021, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కొద్దిరోజులుగా భారత్ తో పాటు  ప్రపంచ క్రికెట్ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేదీలు ఖరారు చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

2022 ఫిబ్రవరి 7, 8 వ తేదీలలో ఐపీఎల్ మెగావేలాన్ని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్టు బోర్డు వర్గాల  సమాచారం. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు అనధికారికంగా తెలిపారు. 

38

సదరు అధికారి మాట్లాడుతూ.. ‘కొవిడ్ పరిస్థితులు మరింత దిగజారకపోతే భారత్ లోనే ఐపీఎల్ మెగా వేలం నిర్వహిస్తాం. రెండ్రొజుల పాటు దీనిని  బెంగళూరులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అందుకు సంబంధించిన పనులు చురుకుగా జరుగుతున్నాయి..’ అంటూ పేర్కొన్నారు. 

48

సాధారణంగా ముంబైలో జరిగే ఐపీఎల్ మెగావేలాన్ని ఈసారి  హైదరాబాద్ లో గానీ బెంగళూరు లో గానీ నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భావించింది. అయితే మెగా వేలం వేదిక హైదరాబాద్ అవుతుందని ఇక్కడి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ బీసీసీఐ మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లింది. 

58

ఇదిలాఉండగా.. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో వేలాన్ని దుబాయ్ లో నిర్వహించాలని కూడా బీసీసీఐ పెద్దలు ప్రతిపాదించినట్టు సమాచారం.
 

68

పరిస్థితులు చేయి దాటితే మాత్రం వేదికను మార్చే అవకాశముంది. అయితే దీనిపై ఇప్పటివరకు బీసీసీఐ దీని మీద  అధికారిక ప్రకటన  వెల్లడించలేదు. 

78

ఈసారి ఐపీఎల్  లో రెండు కొత్త జట్లు వచ్చిన విషయం తెలిసిందే.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల బిడ్ ల ప్రక్రియలో లక్నో, అహ్మాదాబాద్ లు కొత్త ఫ్రాంచైజీలుగా వచ్చాయి. అయితే.. అహ్మాదాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం.. సీవీసీ క్యాపిటల్స్ బెట్టింగ్ సంస్థలతో ఒప్పందాలున్నట్టు   ఆరోపణలు వచ్చాయి. 
 

88

వాటిపై బీసీసీఐ ఇంకా తుది తీర్పు  వెల్లడించాల్సి ఉంది. దీంతో  లక్నో, అహ్మాదాబాద్ లకు సంబంధించిన ఆటగాళ్ల  ఎంపిక ప్రక్రియను కూడా బీసీసీఐ పొడిగించిన విషయం తెలిసిందే.     

About the Author

SM
Srinivas M
Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved