ఆ ఐదుగురూ వచ్చేస్తున్నారు! బుమ్రా, రాహుల్, రిషబ్ పంత్... ఫిట్నెస్ అప్డేట్స్ ఇచ్చిన జై షా...
రెండేళ్లుగా టీమిండియాని వెంటాడుతున్న అతి పెద్ద సమస్య ఆటగాళ్ల గాయాలు. జస్ప్రిత్ బుమ్రా లేకుండానే ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన భారత జట్టు.. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ లేకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ ఆడింది..
ఆసియా కప్ 2023 షెడ్యూల్తో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కౌంట్డౌన్ కూడా మొదలైపోయింది. అయితే ఇప్పటిదాకా టీమిండియా స్టార్ ప్లేయర్ల ఫిట్నెస్, కమ్బ్యాక్ గురించి ఎలాంటి వివరాలు తెలియక ఫ్యాన్స్ తెగ ఆందోళన పడుతున్నారు. దీంతో టీమిండియా ప్లేయర్ల ఫిట్నెస్ అప్డేట్స్ ఇచ్చింది బీసీసీఐ..
Jasprit Bumrah
జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ: గాయాలతో ఐపీఎల్ 2023 టోర్నీ ఆడని ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇప్పటికే నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. త్వరలో ఎన్సీఏలో కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడబోయే బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.. వీలైనంత త్వరలో కమ్బ్యాక్ ఇవ్వబోతున్నారు..
KL Rahul
కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్లో గాయపడిన కెఎల్ రాహుల్... ఇప్పటికే బెంగళూరులోని ఎన్సీఏలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ కోలుకుంటున్న విధానంపై బీసీసీఐ మెడికల్ టీమ్ సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే మరికొన్నిరోజులు ఈ ఇద్దరినీ పర్యవేక్షించబోతున్నారు జాతీయ క్రికెట్ అకాడమీ అధికారులు..
Rishabh Pant
రిషబ్ పంత్: గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, ఆశించిన దాని కంటే వేగంగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రిషబ్ పంత్, జిమ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు చెమటోడుస్తున్నాడు..
Shreyas Iyer
జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణలను ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్కి ఎంపిక చేసే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్.. ఆసియా కప్ 2023 టోర్నీలో రీఎంట్రీ ఇవ్వవచ్చని సమాచారం. రిషబ్ పంత్ మాత్రం వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నాటికి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రిషబ్ పంత్ ఆడతాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడతాడా? లేదా? అనే విషయంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.