రాద్ధాంతం అయ్యాక రాజీ చేశారా... రోహిత్, విరాట్ కోహ్లీలతో బీసీసీఐ వీడియో కాన్ఫిరెన్స్..
First Published Nov 29, 2020, 4:34 PM IST
కాసుల కోసం కరోనాను కూడా లెక్క చేయకుండా ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించిన బీసీసీఐ, ఆటగాళ్ల మధ్య ఏర్పడిన గొడవలను మాత్రం పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో బీభత్సమైన రచ్ఛ జరిగింది. రోహిత్ శర్మ గాయం గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్పడం, తనకు అసలు రోహిత్ ఆస్ట్రేలియాకి ఎందుకు రాలేదో కూడా తెలియదని విరాట్ కోహ్లీ చెప్పడం తీవ్రమైన చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ విషయంపై ఓ పరిష్కారం తెచ్చేదిశగా అడుగులు వేసిందట బీసీసీఐ.

భారత సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నాయని, దాదాపు ఏడాదిన్నర వినిపిస్తున్న వార్త. వన్డే వరల్డ్కప్ 2019లో భారత జట్టు సెమీస్ నుంచి తప్పుకోవడానికి కూడా ఈ వివాదమై కారణమనే టాక్ ఉంది.

అయితే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని నచ్చజెప్పడానికి ప్రయత్నించిన బీసీసీఐ, ముదురుతున్న వివాదానికి ఓ పరిష్కారం కనుగొనే ప్రయత్నం మాత్రం చేయలేదు...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?