కివీస్తో ఆసీస్ టీ20 మ్యాచ్... కోట్లు పెట్టి కొన్న ఆర్సీబీ ప్లేయర్లు అందరూ అట్టర్ ఫ్లాప్...
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మొదటి టీ20 మ్యాచ్లో 53 పరుగుల తేడాతో ఓడింది ఆస్ట్రేలియా. అయితే ఇది న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా అనే కంటే ఎక్కువగా న్యూజిలాండ్ వర్సెస్ ఆర్సీబీగానే ఎక్కువ ప్రచారం పొందింది. కివీస్ను ఢీకొన్న ఆస్ట్రేలియా జట్టులో ఏకంగా ఆరుగురు ఆర్సీబీ ప్లేయర్లు ఉండడమే దీనికి కారణం.
ఐపీఎల్ మినీ వేలం 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... రూ.14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్, 5 బంతులాడి కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు...
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి ట్రేడ్ చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుకున్న డానియల్ సామ్స్ బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి, 2 వికెట్లు తీశాడు...
గత ఏడాది రూ. కోటిన్నర పెట్టి కొనుగోలు చేసిన ఆడమ్ జంపా 3 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి, వికెట్లేమీ తీయలేకపోయాడు.
గత ఏడాది రూ.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కేన్ రిచర్డ్సన్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు...
అలాగే ఆర్సీబీ రిటైన్ చేసుకున్న యంగ్ ప్లేయర్ జోష్ ఫిలిప్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... ఆర్సీబీ విడుదల చేసి, ఐపీఎల్ 2021 మినీ వేలంలో అమ్ముడుపోని ఆరోన్ ఫించ్ కూడా 1 పరుగుకే అవుట్ అయ్యాడు.
వీరితో పాటు రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన న్యూజిలాండ్ బౌలర్ కేల్ జెమ్మిసన్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు...
ఐపీఎల్ 2021 మినీ వేలంలో అమ్ముడుపోని న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డివాన్ కాన్వే 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 99 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
రూ.14 కోట్లు పెట్టి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన జే రిచర్డ్సన్ బ్యాటింగ్లో 11 పరుగులు చేయగా, బౌలింగ్లో 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ వేలంలో కాన్వే బేస్ ప్రైజ్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే. అయినా ఏ జట్టూ అతన్ని కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు...
అలాగే ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఏ జట్టు పట్టించుకోని ఇష్ సౌధీ 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం మరో విశేషం...