MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Sri Lanka Crisis: ఆసీస్ ఆటగాళ్ల ఉదారత.. లంకలో చిన్నారులకు సాయం

Sri Lanka Crisis: ఆసీస్ ఆటగాళ్ల ఉదారత.. లంకలో చిన్నారులకు సాయం

Sri Lanka Crisis: ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో  ప్రజలు దినదినగండంగా బతుకుతున్నారు. నిత్యావసరాల పెరుగుదల అక్కడ ప్రజలను కుంగదీస్తున్నది. 

1 Min read
Author : Srinivas M
Published : Aug 11 2022, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో  ప్రజల  స్థితిగతులను చూసి ఆస్ట్రేలియా క్రికెటర్లు చలించారు.  వారి ఆకలిని తీర్చడానికి ముందుకొచ్చారు. ఇటీవలే కంగారూలు.. లంకలో మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు కూడా ఆడిన విషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే లంకలో పరిస్థితులను దగ్గర్నుంచి గమనించిన ఆసీస్ ఆటగాళ్లు తమ ఉదారతను చాటుకున్నారు. ఈ  పర్యటనలో భాగంగా వాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీని లంక చిన్నారులకు అందించనున్నారు.  

37

నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరాభారం పెరిగి  పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులు చూసుకోవడానికి పనిచేస్తున్న యూనిసెఫ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ప్రైజ్ మనీని అందించనున్నారు. 

47

ఆసీస్ లో యూనిసెఫ్ కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీ (45వేల ఆస్ట్రేలియా డాలర్లు)ని లంకలో యూనిసెఫ్ కు అందించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. 

57

ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది ప్రపంచం ముందు కనబడుతున్న సత్యం. మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా చూశాం. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం.  తద్వారా  చిన్నారులకు, పేద ప్రజలకు సాయం చేయాలని ఆశించాం..’ అని అన్నాడు. 
 

67

కమిన్స్ ఇలా సాయం చేయడం ఇదేం ప్రథమం కాదు.  గతేడాది కరోనా సందర్బంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక భారత్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్యాట్ కమిన్స్, క్రికెట్ ఆస్ట్రేలియా లు కలిసి 50వేల డాలర్ల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. 

77

లంక పర్యటనలో ఆసీస్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. ఇక టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
INDW vs PAKW: స‌త్తా చాటిన‌ అమ్మాయిలు.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా
Recommended image2
IND-W vs PAK-W: హర్మన్‌ప్రీత్ కౌర్ మరో ఘనత.. మిథాలీ రాజ్ రికార్డు బ్రేక్
Recommended image3
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్.. గెలుపు ఎవరిది? హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved