- Home
- Sports
- Cricket
- టీమిండియా సెలక్టర్లు, అనుష్క శర్మకు టీ ఇచ్చారా.... 2019 వన్డే వరల్డ్కప్ వివాదంపై ఎమ్మెస్కే ప్రసాద్ స్పందన
టీమిండియా సెలక్టర్లు, అనుష్క శర్మకు టీ ఇచ్చారా.... 2019 వన్డే వరల్డ్కప్ వివాదంపై ఎమ్మెస్కే ప్రసాద్ స్పందన
టీమిండియా ఇప్పుడు అద్భుతమైన ఫామ్లో ఉంది. ఛాంపియన్ ఆటతీరుతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దూసుకొచ్చిన టీమిండియా, పటిష్టమైనరిజర్వు బెంచ్తో ఒకేసారి రెండు భిన్నమైన టోర్నీల్లో రెండు భిన్నమైన టీమ్లతో పాల్గొనబోతోంది...

<p>టీమిండియా ప్రస్తుతం ఉన్న స్థితికి తామే కారణమని, అయితే అది ఎవ్వరూ గుర్తించడం లేదని వాపోయాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. అలాగే 2019 వన్డే వరల్డ్కప్లో జరిగిన ఓ సంఘటన గురించి స్పందించాడు...</p>
టీమిండియా ప్రస్తుతం ఉన్న స్థితికి తామే కారణమని, అయితే అది ఎవ్వరూ గుర్తించడం లేదని వాపోయాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. అలాగే 2019 వన్డే వరల్డ్కప్లో జరిగిన ఓ సంఘటన గురించి స్పందించాడు...
<p>2019 వన్డే వరల్డ్కప్ సమయంలో భారత జట్టు ఎంపికపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అంబటి రాయుడి వంటి సీనియర్ ప్లేయర్ని పక్కనబెట్టి, విజయ్ శంకర్ను మెగా టోర్నీకి ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది...</p>
2019 వన్డే వరల్డ్కప్ సమయంలో భారత జట్టు ఎంపికపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అంబటి రాయుడి వంటి సీనియర్ ప్లేయర్ని పక్కనబెట్టి, విజయ్ శంకర్ను మెగా టోర్నీకి ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది...
<p>సెమీస్లో స్వల్ప టార్గెట్ను చేధించలేక న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది టీమిండియా. టాపార్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా పెద్దగా రాణించలేకపోయింది. దీంతో సెలక్షన్ కమిటీపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది....</p>
సెమీస్లో స్వల్ప టార్గెట్ను చేధించలేక న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది టీమిండియా. టాపార్డర్తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా పెద్దగా రాణించలేకపోయింది. దీంతో సెలక్షన్ కమిటీపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది....
<p>‘టీమిండియా సెలక్షన్ కమిటీ ఓ మిక్కీమౌజ్ కమిటీలా ఉంది. విరాట్ కోహ్లీ ఏది చెబితే, సెలక్టర్లు అదే చేస్తున్నారు. ఇది జట్టు పర్ఫామెన్స్పై తీవ్ర ప్రభావం చూపుతోంది...</p>
‘టీమిండియా సెలక్షన్ కమిటీ ఓ మిక్కీమౌజ్ కమిటీలా ఉంది. విరాట్ కోహ్లీ ఏది చెబితే, సెలక్టర్లు అదే చేస్తున్నారు. ఇది జట్టు పర్ఫామెన్స్పై తీవ్ర ప్రభావం చూపుతోంది...
<p>సెలక్షన్ కమిటీలో ఉన్నవారంతా కలిపి కూడా పట్టుమని 12 టెస్టులు కూడా ఆడలేదు. వారికి ఉన్న అర్హతలు ఏంటి? వన్డే వరల్డ్కప్ కోసం ఇంగ్లాండ్కి వచ్చిన సెలక్టర్లను చూసి అస్సలు గుర్తుపట్టలేకపోయా...</p>
సెలక్షన్ కమిటీలో ఉన్నవారంతా కలిపి కూడా పట్టుమని 12 టెస్టులు కూడా ఆడలేదు. వారికి ఉన్న అర్హతలు ఏంటి? వన్డే వరల్డ్కప్ కోసం ఇంగ్లాండ్కి వచ్చిన సెలక్టర్లను చూసి అస్సలు గుర్తుపట్టలేకపోయా...
<p>టీమిండియా బ్లేజర్ వేసుకున్న ఓ వ్యక్తిని అడిగితే, తాను సెలక్టర్నని చెప్పాడు. బీసీసీఐ బ్లేజర్లు ధరించిన వాళ్లంతా కలిసి అనుష్క శర్మకు టీ సర్వ్ చేశారు...’ అంటూ మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ కామెంట్ చేశాడు.</p>
టీమిండియా బ్లేజర్ వేసుకున్న ఓ వ్యక్తిని అడిగితే, తాను సెలక్టర్నని చెప్పాడు. బీసీసీఐ బ్లేజర్లు ధరించిన వాళ్లంతా కలిసి అనుష్క శర్మకు టీ సర్వ్ చేశారు...’ అంటూ మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ కామెంట్ చేశాడు.
<p>ఫరూక్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. దాంతో అనవసర వివాదంలోకి తనని ఎందుకు లాగుతున్నారని విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్పందించాల్సి వచ్చింది...</p>
ఫరూక్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. దాంతో అనవసర వివాదంలోకి తనని ఎందుకు లాగుతున్నారని విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్పందించాల్సి వచ్చింది...
<p>‘అనవసర వివాదాల్లో నన్ను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. వన్డే వరల్డ్కప్లో నేను స్టేడియంలోకి వచ్చి చూసింది ఒకే ఒక్క మ్యాచ్. అది కూడా నేను ఫ్యామిలీ బాక్స్లో ఉండి చూశా...</p>
‘అనవసర వివాదాల్లో నన్ను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. వన్డే వరల్డ్కప్లో నేను స్టేడియంలోకి వచ్చి చూసింది ఒకే ఒక్క మ్యాచ్. అది కూడా నేను ఫ్యామిలీ బాక్స్లో ఉండి చూశా...
<p>సెలక్టర్ల బాక్సులోకి కానీ, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కి కానీ నేను వెళ్లలేదు. అర్థం పర్థం లేని విమర్శలు చేయడం ఏ మాత్రం సరికాదు’ అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించింది అనుష్క శర్మ...</p>
సెలక్టర్ల బాక్సులోకి కానీ, టీమిండియా డ్రెస్సింగ్ రూమ్కి కానీ నేను వెళ్లలేదు. అర్థం పర్థం లేని విమర్శలు చేయడం ఏ మాత్రం సరికాదు’ అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించింది అనుష్క శర్మ...
<p>అనుష్క శర్మ ట్వీట్తో మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్... తాను సెలక్టర్లు, అనుష్క శర్మకు టీ సర్వ్ చేశారనేది కేవలం జోక్లా చెప్పానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దాన్ని పెద్దది చేయొద్దని చెప్పాడు...</p>
అనుష్క శర్మ ట్వీట్తో మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్... తాను సెలక్టర్లు, అనుష్క శర్మకు టీ సర్వ్ చేశారనేది కేవలం జోక్లా చెప్పానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దాన్ని పెద్దది చేయొద్దని చెప్పాడు...
<p>తాజాగా ఈ వివాదంపై మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు... ‘అనుష్క శర్మకు టీ సర్వ్ చేసింది ఎవరు? సెలక్టర్లకి టీ సర్వ్ చేయాల్సిన అవసరం ఏముంది?</p>
తాజాగా ఈ వివాదంపై మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు... ‘అనుష్క శర్మకు టీ సర్వ్ చేసింది ఎవరు? సెలక్టర్లకి టీ సర్వ్ చేయాల్సిన అవసరం ఏముంది?
<p>ఆ వివాదంలో సెలక్టర్ల కమిటినీ అనవసరంగా లాగారు. టీమిండియా లాంటి జట్టుకి సెలక్టర్గా పనిచేయడం చాలా కష్టం. ప్లేయర్లను ఎంపిక చేసే విషయంలో ఎన్నో ప్రమాణాలను ప్రతిపాదికగా తీసుకుంటాం...</p>
ఆ వివాదంలో సెలక్టర్ల కమిటినీ అనవసరంగా లాగారు. టీమిండియా లాంటి జట్టుకి సెలక్టర్గా పనిచేయడం చాలా కష్టం. ప్లేయర్లను ఎంపిక చేసే విషయంలో ఎన్నో ప్రమాణాలను ప్రతిపాదికగా తీసుకుంటాం...
<p>కానీ మేం ఎవరిని జట్టుకి ఎంపిక చేసినా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్లేయర్లను పక్కనబెట్టినా ఈ విమర్శలు తప్పలేదు. ఇప్పుడు టీమిండియా సక్సెస్లో మాకు మాత్రం క్రెడిట్ దక్కడం లేదు.</p>
కానీ మేం ఎవరిని జట్టుకి ఎంపిక చేసినా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్లేయర్లను పక్కనబెట్టినా ఈ విమర్శలు తప్పలేదు. ఇప్పుడు టీమిండియా సక్సెస్లో మాకు మాత్రం క్రెడిట్ దక్కడం లేదు.
<p>ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు చరిత్ర క్రియేట్ చేసింది. కానీ అప్పుడు సెలక్టర్లను ఎవ్వరూ ప్రశంసించలేదు. టీమ్ మేనేజ్మెంట్ తప్ప, ఎవ్వరూ పనిని గుర్తించలేదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.</p>
ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు చరిత్ర క్రియేట్ చేసింది. కానీ అప్పుడు సెలక్టర్లను ఎవ్వరూ ప్రశంసించలేదు. టీమ్ మేనేజ్మెంట్ తప్ప, ఎవ్వరూ పనిని గుర్తించలేదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
<p>ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్గా నాలుగేళ్ల వ్యవహారించగా, ఈ సమయంలో భారత జట్టు రెండు కీలక టోర్నీల్లో విఫలమైంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో చిత్తుకాగా, 2019 వన్డే వరల్డ్కప్లో సెమీస్ నుంచే నిష్కమించింది.</p>
ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్గా నాలుగేళ్ల వ్యవహారించగా, ఈ సమయంలో భారత జట్టు రెండు కీలక టోర్నీల్లో విఫలమైంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో చిత్తుకాగా, 2019 వన్డే వరల్డ్కప్లో సెమీస్ నుంచే నిష్కమించింది.