- Home
- Sports
- Cricket
- అజింకా రహానేకి ఇక కష్టమే... శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ, కెఎల్ రాహుల్కి వైస్ కెప్టెన్సీతో...
అజింకా రహానేకి ఇక కష్టమే... శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ, కెఎల్ రాహుల్కి వైస్ కెప్టెన్సీతో...
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టు, జోహన్బర్గ్తో ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ టెస్టు సిరీస్కి కెఎల్ రాహుల్కి వైస్ కెప్టెన్సీ అప్పగించడం, చర్చనీయాంశమవుతోంది...

ఆగస్టులో జరిగిన ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు వరకూ కెఎల్ రాహుల్కి టెస్టు టీమ్లో ప్లేస్ కూడా లేదు...
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు శుబ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయపడడంతో కెఎల్ రాహుల్కి అవకాశం దక్కింది...
ఆ టెస్టు సిరీస్లో కెఎల్ రాహుల్ ఆకట్టుకోవడంతో టెస్టు టీమ్లోనూ స్థిరమైన చోటు దక్కించుకున్నాడు కెఎల్ రాహుల్...
రీఎంట్రీలో కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే ఆడిన కెఎల్ రాహుల్ను టెస్టు వైస్ కెప్టెన్గా నియమించడం సరైన నిర్ణయం కాదని విమర్శిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...
అయితే కెఎల్ రాహుల్కి వైస్ కెప్టెన్సీ దక్కడంతో అజింకా రహానేకి తుదిజట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది...
కెఎల్ రాహుల్తో పాటు న్యూజిలాండ్తో సిరీస్లో సెంచరీ చేసి కమ్బ్యాక్ ఇచ్చిన మయాంక్ అగర్వాల్... సౌతాఫ్రికా టూర్లో ఓపెనర్లుగా వ్యవహరించబోతున్నారు...
ఈ ఇద్దరిలో ఎవరైనా గాయపడితే గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పంచల్2కి అవకాశం దక్కొచ్చు. వన్డౌన్ ప్లేయర్గా ఛతేశ్వర్ పూజారా, టూ డౌన్లో విరాట్ కోహ్లీ స్థానాలు ఫిక్స్...
కాన్పూర్ టెస్టులో సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్ను కాదని, అజింకా రహానేని ఆడించే సాహసం టీమిండియా చేయకపోవచ్చు...
కెఎల్ రాహుల్కి వైస్ కెప్టెన్సీ దక్కకపోయి ఉంటే, మయాంక్ అగర్వాల్, పూజారా ఓపెనర్లుగా వచ్చి ఐదో స్థానంలో అజింకా రహానేని ఆడించేందుకు ఆస్కారం ఉండేది...
కానీ ఇప్పుడు అజింకా రహానే పొజిషన్పై అనుమానాలు రేగుతున్నాయి. రహానే తుదిజట్టులో చోటు దక్కించుకోవాలంటే టీమిండియా రెగ్యూలర్ బ్యాటింగ్ ఆర్డర్లో ఎవ్వరైనా గాయపడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు..