ఐపీఎల్లో డివిలియర్స్ ఫేవరేట్ ప్లేయర్ అతడే.. కోహ్లీకి దక్కని చోటు..
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ పేరు చెబితే అభిమానులకు గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ - ఏబీ డివిలియర్స్ విన్యాసాలే. ఈ ఇద్దరూ ఆ జట్టు బ్యాటింగ్కు మూల స్తంభాలు. కానీ అలాంటి డివిలియర్స్...
సౌతాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీకి దశాబ్దంపాటు సేవలందించిన మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. సుమారు దశాబ్దకాలం పాటు ఈ ఇద్దరూ ఆర్సీబీ బ్యాటింగ్కు వెన్నెముకలా ఉండేవారు. వృత్తిగతంగానే గాక డివిలియర్స్.. కోహ్లీలు ఫ్యామిలీపరంగా కూడా మంచి మిత్రులు.
కానీ డివిలియర్స్ మాత్రం ఐపీఎల్ - 2023 తన ఫేవరేట్ ప్లేయర్ లిస్ట్ లో కోహ్లీని చేర్చలేదు. అలాగని కోహ్లీ ఈ సీజన్ లో ఆడలేదా..? అంటే అదీ లేదు. ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ.. 14 మ్యాచ్ లలోనే 53.25 సగటుతో ఏకంగా 625 పరుగులు చేశాడు. ఇందులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కూడా ఉన్నాయి.
రికార్డులు తిరగరాస్తూ ఐపీఎల్ లో ఏడు వేల పరుగులు, ఏడు సెంచరీలు చేసిన కోహ్లీ కంటే తనకు రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫేవరేట్ ప్లేయర్ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. రాబోయే రోజుల్లో అతడు సూపర్ స్టార్ గా మారుతాడని తెలిపాడు.
Image credit: PTI
జియో సినిమాలో జరిగిన ఓ కార్యక్రమంలో డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘నా వరకైతే ఈ ఐపీఎల్ సీజన్ లో ఫేవరేట్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. రాబోయే రోజుల్లో అతడు సూపర్ స్టార్ అవుతాడు. ఈ యువ ఓపెనర్ అన్ని షాట్లను ఆడగలడు. క్రీజులో ప్రశాంతంగా ఉంటూనే దూకుడైన ఆట ఆడటంలో అతడు ఎక్స్పర్ట్. నాకు అది చాలా నచ్చింది.
ఇన్నింగ్స్ ఆది నుంచే బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ ధాటిగా ఆడటంలో యశస్వి దిట్ట. దాంతో అతడు పరిస్థితులను తన కంట్రోల్ లోకి తెచ్చుుకుంటాడు. శుభ్మన్ కంటే యశస్వి ఇంకా చాలా యంగ్. ఫ్యూచర్ లో సూపర్ స్టార్ గా ఎదగడానికి జైస్వాల్ కు అన్ని లక్షణాలు ఉన్నాయి..’ అని మిస్టర్ 360 చెప్పాడు.
కాగా ఈ సీజన్ లో జైస్వాల్.. రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 14 మ్యాచ్ లలో జైస్వాల్.. 48.08 సగటుతో 625 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు ఐదు అర్థ సెంచరీలున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో జైస్వాల్.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.