2020లో కోహ్లీ, రోహిత్ కంటే టాప్లో కెఎల్ రాహుల్... టెస్టుల్లో అజింకా రహానే...
2020 ఏడాది నేటితో ముగియనుంది. యావత్ ప్రపంచాన్ని వణికించి, అల్లకల్లోలం సృష్టించిన ఈ ఏడాది, కరోనా వైరస్ కారణంగా క్రికెట్కి కూడా ఎనిమిది నెలల బ్రేక్ పడింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధైర్యం చేసి, ఐపీఎల్ 2020 సీజన్ మొదలెట్టడంతో మళ్లీ క్రికెట్ సీజన్ మొదలైంది. 2020 సీజన్లో ఎన్నో చిత్రవిచిత్రాలు జరిగినట్టే, క్రికెట్లోనూ సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ పరుగుల వేగం పడిపోతే, కెఎల్ రాహుల్ స్పీడ్ పెంచి దూసుకొచ్చాడు.
2020 ఏడాదిలో వన్డే, టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా కెఎల్ రాహుల్ నిలిచాడు...
మొత్తంగా ఈ ఏడాది 20 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన కెఎల్ రాహుల్, 49.82 సగటుతో 847పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
2016 నుంచి నాలుగేళ్లుగా 50+ సగటుతో పరుగులు చేస్తూ వస్తున్న భారత సారథి విరాట్ కోహ్లీ... ఈ ఏడాది ఆ సగటును కోల్పోయాడు...
ఈ ఏడాది 22 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం 36.60 సగటుతో 842 పరుగులు చేశాడు...
ఈ ఏడాది కేవలం 7 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 51.83 సగటుతో 311 పరుగులు చేయడం విశేషం..
ఈ ఏడాది 9 వన్డేలు ఆడిన కెఎల్ రాహుల్ 55.37 సగటుతో 443 పరుగులు చేయగా, ఐపీఎల్ 2020 సీజన్లోనూ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా ఆరెంజ్ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే...
ఈ ఏడాది 9 వన్డేలు ఆడిన కెఎల్ రాహుల్ 55.37 సగటుతో 443 పరుగులు చేయగా, ఐపీఎల్ 2020 సీజన్లోనూ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా ఆరెంజ్ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే...
గత మూడేళ్లుగా టెస్టుల్లో టాప్ 2పైనే ఉంటూ వస్తున్న విరాట్ కోహ్లీ, కొత్త ఏడాది టాప్ 3తో ప్రారంభించబోతున్నాడు. కేన్ విలియంసన్ వరుస సెంచరీలు సాధించడం, స్టీవ్ స్మిత్ గత మూడు ఇన్నింగ్స్ల్లో ఫెయిల్ కావడంతో విరాట్ కోహ్లీ ర్యాంకుపై ప్రభావం పడనుంది.
ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా అజింకా రహానే నిలిచాడు...
2020 ఏడాదిలో టెస్టుల్లో ఒకే ఒక్క సెంచరీ నమోదుచేసింది టీమిండియా. అది కూడా బాక్సింగ్ డే టెస్టులో అజింకా రహానే బ్యాటు నుంచి వచ్చిందే..