2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ధోనీ ఏం చెప్పాడంటే... టీమిండియాలో బూస్టు నింపిన ఆ స్పీచ్...
మహేంద్ర సింగ్ ధోనీ... ఓ నిజమైన నాయకుడు. కొన్నాళ్ల పాటు భారత జట్టు విజయాల్లో ముందుండి నడిపిస్తూ కీలక పాత్ర పోషించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఆ తర్వాత భారత జట్టను మ్యాచ్ విన్నర్లతో నింపేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి నేటికి సరిగ్గా 8 ఏళ్లు...
2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు, టాప్ టీమ్ ఇంగ్లాండ్తో తలబడింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆలస్యంగా ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది.
విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 43 పరుగులు చేయగా శిఖర్ ధావన్ 24 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 31 పరుగులు చేశాడు.
రవీంద్ర జడేజా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాలుగు బంతులాడి డకౌట్ అయ్యాడు... భారత సంతతి ఆటగాడు రవి బోపారా మూడు వికెట్లు తీసి భారత జట్టును దెబ్బతీశాడు.
ఇంగ్లాండ్ టార్గెట్ 130 పరుగులు మాత్రమే. ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ జట్టును 130 పరుగులు కొట్టకుండా నియంత్రించడమంటే అసాధ్యమనే చెప్పాలి... దీంతో టీమిండియా ఫైనల్లో ఓడినట్టే అని భావించారంతా...
అయితే టీమిండియా అద్భుతం చేసింది... అలెస్టర్ కుక్, ట్రాట్, జో రూట్, ఇయాన్ బెల్ వికెట్లను త్వరగానే కోల్పోయింది ఇంగ్లాండ్. 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ను ఇయాన్ మోర్గాన్, రవి బొపార కలిసి ఆదుకున్నారు.
ఇద్దరూ ఐదో వికెట్కి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయం అంచుల దాకా తీసుకెళ్లారు. అయితే 33 పరుగులు చేసి మోర్గాన్ను, 30 పరుగులు చేసిన బోపారాను ఇషాంత్ శర్మ అవుట్ చేయడం, ఆ తర్వాత జోస్ బట్లర్ను జడ్డూ డకౌట్ చేయడంతో ఈక్వేషన్ ఇంట్రెస్టింగ్గా మారింది.
ఆఖరి 10 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన పరిస్థితి. బ్రాడ్, జేమ్స్ ట్రెడ్వెల్ 3 పరుగులు చేయడంతో ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ టార్గెట్ 15 పరుగులకి వచ్చింది... భువీ, ఉమేశ్ యాదవ్ స్పెల్స్ పూర్తిచేయకపోయినా ఆఖరి ఓవర్ వేసేందుకు రవి అశ్విన్కి బంతిని అందించాడు ధోనీ...
తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి ఫోర్ బాదాడు బ్రాడ్. నాలుగు బంతుల్లో 11 పరుగుల లక్ష్యం. మూడో బంతికి సింగిల్ రాగా, నాలుగో బంతికి రెండు పరుగులు, ఐదో బంతికి 2 పరుగుల వచ్చాయి. ఆఖరి బంతికి సిక్సర్ కొడితే ఇంగ్లాండ్దే విజయం...
ట్రెండ్వెల్, అశ్విన్ వేసిన బంతిని పూర్తిగా మిస్ కావడంతో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్ అందుకున్న ధోనీ, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందుకుని ఐసీసీ టోర్నీలన్నీ గెలిచిన కెప్టెన్గా నిలిచాడు
భారత జట్టు విజయం వెనక ధోనీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఉందట. ‘మనం భారీ స్కోరు చేయలేకపోయాం. కానీ పిచ్ బౌలింగ్కి చక్కగా సహకరిస్తోంది. ఆకాశాన్ని చూడకండి. మిమ్మల్ని కాపాడడానికి ఏ దేవుడు రాడు...
ఇప్పుడు చేయాల్సిందల్లా నెం.1 టీమ్గా ఆడడమే...’ అంటూ వాళ్లపై వారికి భరోసా, నమ్మకం నింపాడట ధోనీ. క్రికెట్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? అనే పాఠానికి పర్ఫెక్ట్ ఎంగ్జాఫుల్గా మిగిలిపోయిందీ మ్యాచ్...