ఎండాకాలంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయి: పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వాహనదారులు బండెక్కాలంటేనే భయపడుతున్నారు.పెరిగిన ధరలను తగ్గించాలంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి. అటు జనం సైతం ప్రభుత్వాలు ధరలు తగ్గిస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శీతాకాలం పోతే పెట్రోల్ ధరలు దిగివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా శీతాకాలంలో డిమాండ్ అధికంగా ఉంటుంది కాబట్టి చలి కాలం పూర్తయితే ధరలు తగ్గుతాయని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
11

<p>cartoon punch</p>
cartoon punch
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos