MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త రూల్: ఈ విషయంలో ప్రభుత్వం కీలక మార్పు చేయబోతోంది.. అదేంటంటే ?

వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త రూల్: ఈ విషయంలో ప్రభుత్వం కీలక మార్పు చేయబోతోంది.. అదేంటంటే ?

కరోనా మహమ్మారి కారణంగా ఒకవైపు ప్రజల జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటే, మరోవైపు ప్రజల ఉద్యోగాల విధానంలో పెనుమార్పు వచ్చింది. అలాగే పెరుగుతున్న ఓమిక్రాన్ (omicron)కేసుల దృష్ట్యా మరోసారి వ్యాప్తిని నిరోధించడానికి దేశంలో అనేక ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్(work from home) చర్చ పెరిగింది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jan 05 2022, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కాగా చాలా కార్యాలయాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో ఆర్‌జి‌పి గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా డిసెంబర్ 31 సాయంత్రం ట్వీట్ చేస్తూ తమ కంపెనీ ఉద్యోగులందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్  చేయలని, అలాగే అన్ని కార్యాలయాలు మూసివేయబడతాయని తెలియజేసారు. దీంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిబంధనలు తీసుకురావాలని ఆలోచిస్తోంది. దీని కింద, ఉద్యోగులు  వర్క్ ఫ్రమ్ హోమ్  చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. 

25

కార్మిక మంత్రిత్వ శాఖ కూడా  వర్క్ ఫ్రమ్ హోమ్  కోసం ముసాయిదాను విడుదల చేసింది. తయారీ, మైనింగ్, సేవా రంగాల ఉద్యోగులను ఈ ముసాయిదాలో చేర్చనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ చర్యతో కార్యాలయాల పని సంస్కృతిలో పెను మార్పు కనిపిస్తోంది.

35

హెచ్‌ఆర్‌ఏ తీసివేయవచ్చు 
ఈ కొత్త పాలసీ ప్రకారం హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)అంటే ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏలో కోత కూడా పరిగణనలోకి తీసుకోబడింది. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ డ్రాఫ్ట్ ప్రకారం, కొత్త నిబంధనలలో ఐటీ రంగం ప్రత్యేక మినహాయింపులను కూడా పొందవచ్చు. ఇందులో ఐటీ ఉద్యోగులకు కూడా పనివేళల్లో సౌలభ్యం లభించే అవకాశం ఉంది.
 

45

కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఐటీ రంగంలోని ఉద్యోగుల భద్రతతో పాటు సేవా రంగానికి చెందిన అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మొదటిసారిగా ఈ ప్రత్యేక నమూనాను సిద్ధం చేశారు.

55

అంతేకాకుండా ఈ కొత్త ముసాయిదాపై కార్మిక మంత్రిత్వ శాఖ సాధారణ ప్రజల నుండి సలహాలను కూడా కోరింది. మీరు కూడా దీనికి సంబంధించి ఏదైనా సూచన ఇవ్వాలనుకుంటే, మీరు మీ సూచనను 30 రోజుల్లోపు కార్మిక మంత్రిత్వ శాఖకు పంపవచ్చు. అయితే, కార్మిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌లో ఈ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate in Hyderabad: ఉగాది గుడ్‍న్యూస్...తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎంతో తెలుసా?
Recommended image2
High Court: ఒక్కడే కూర్చుని అడల్ట్ సైట్‌లు చూస్తున్నారా.! హైకోర్టు ఏం చెప్పిందంటే.?
Recommended image3
Property Registration: అగ్రిమెంట్ అయినా రిజిస్ట్రేషన్ చెయ్యట్లేదా.. ఇలా చేస్తే దెబ్బకు కాళ్ల బేరానికి వస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved