MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వందే భారత్ రైళ్లకు టాటా స్టీల్ సీట్లు..విమానంలో సీట్ల కన్నా మెరుగైన సదుపాయాలు..

వందే భారత్ రైళ్లకు టాటా స్టీల్ సీట్లు..విమానంలో సీట్ల కన్నా మెరుగైన సదుపాయాలు..

టాటా స్టీల్ అత్యాధునిక రైలు వందే భారత్ కోసం అత్యుత్తమ సీట్ల నుండి డిజైన్ చేస్తోంది. టాటా స్టీల్ 2026 నాటికి ఆర్ అండ్ డీ విభాగంపై రూ.3,000 కోట్లు వెచ్చించాలని యోచిస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని 22 రైళ్లకు సీట్లను అందించడానికి కంపెనీ కాంపోజిట్ సెక్షన్ ఆర్డర్‌ను అందుకుంది.

2 Min read
Author : Krishna Adhitya
Published : Aug 01 2022, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
vande bharat

vande bharat

వందే భారత్ రైలు దేశంలోనే అత్యాధునిక రైలు. భారతీయ రైల్వేకు చెందిన ఈ ప్రత్యేక రైలులో చాలా ప్రత్యేకమైన సీట్లు ఏర్పాటు చేయబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా రైలులో సీట్లను సిద్ధం చేసే బాధ్యతను టాటా స్టీల్ కంపెనీ లిమిటెడ్ కు అప్పగించారు.  టాటా స్టీల్ కంపెనీ సెప్టెంబర్ నుంచి ఈ సీట్ల డెలివరీని ప్రారంభించనుంది. దేశంలో ఇలాంటి సీట్లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ సీట్లలో కూర్చునే ప్రయాణీకులు 180 డిగ్రీల వరకు తిప్పవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

వందే భారత్ రైలు ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో అమర్చిన రైలుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ సౌకర్యాలకు మరో ఫీచర్ గా ఆధునిక సీట్లను జోడిస్తున్నారు. ఈ రైలు దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సీట్లను పొందబోతోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని 22 రైళ్లకు సీట్లు సమకూర్చేందుకు కంపెనీ కాంపోజిట్స్ విభాగానికి ఆర్డర్ వచ్చిందని టాటా స్టీల్ వైస్ ప్రెసిడెంట్ దేబాశిష్ భట్టాచార్య తెలిపారు. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ.145 కోట్లు.

34

 వందేభారత్ రైలులో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సీట్లలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి . అన్నింటిలో మొదటిది, ఈ సీట్లు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ప్రయాణికులు తమ సౌకర్యాన్ని బట్టి ఈ సీట్లను 180 డిగ్రీల వరకు తిప్పుకోవచ్చు. విమానాల సీట్ల తరహాలోనే ఇవి అత్యంత సౌకర్యవంతమైన సీట్లు, సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ సీట్లు ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్ (FRP)తో తయారు చేశారు. దీని వల్ల ఈ సీట్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణికుల భద్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సీట్లు భారతదేశంలో మొదటిసారిగా రైళ్లలో వినియోగిస్తున్నారు. 

44

టాటా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నుంచి ఈ సీట్ల సరఫరా ప్రారంభం కానుంది. అదే సమయంలో, 20 రైళ్లకు సీట్ల ఆర్డర్ ఏడాదిలో పూర్తవుతుంది. వందే భారత్ రైలు స్వదేశీయంగానే ఎక్కువగా అభివృద్ధి చేయబడింది. వందే భారత్ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడపగలదు. దేశంలోనే అత్యంత వేగవంతమైన రైళ్లలో ఇదొకటి అని పేర్కొన్నారు.

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Plastic Currency: భారత మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయి.. పాత కరెన్సీ నోట్ల సంగతేంటి?
Recommended image2
Recharge Plans: టెలికాం యూజ‌ర్ల‌కు గ‌ట్టిదెబ్బ‌.. రూ. 299 ప్లాన్ ఇక లేన‌ట్లే
Recommended image3
iPhone: భారీగా పడిపోయిన ఐఫోన్ ధర, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved