MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. మార్చి 2022 వరకు ఉచిత రేషన్..

రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. మార్చి 2022 వరకు ఉచిత రేషన్..

 పేదలకు ఉచిత రేషన్(free ration) అందించడానికి పి‌ఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)ను మార్చి 2022 వరకు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. నేడు కేబినెట్ నిర్ణయాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (anurag thakur)ఈ వివరాలను వెల్లడించారు.

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 24 2021, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Ration Shop

Ration Shop

 గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్​డౌన్ దృష్ట్యా పెదప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్​ కళ్యాణ్​ అన్న యోజన(పీఎంజీకెఏవై)ని మార్చి 2020లో ప్రకటించారు. 2020 ఏప్రిల్​లో మొదలైన ఈ పథకం కరోనా సెకండ్ వేవ్ ​కారణంగా ఈ ఏడాది జూన్​ వరకు పొడగించారు.

ప్రతిపాదిత వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవడం  
అంతేకాకుండా శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన మంత్రివర్గం ప్రతిపాదిత వ్యవసాయ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈరోజు లాంఛనాలను పూర్తి చేసిందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకోవడం మా ప్రాధాన్యత అని తెలిపారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Ration Shop

Ration Shop

80 కోట్ల లబ్ధిదారులకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు
పి‌ఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా COVID 19 మహమ్మారి లాక్‌డౌన్‌  మధ్య పేద ప్రజలకు ఉపశమనం అందించడానికి ఈ పథకం మొదట ఏప్రిల్ 2020 నుండి మూడు నెలల పాటు ప్రారంభించింది. అప్పటి నుంచి పలుమార్లు పొడిగించారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద సాధారణ కోటా కంటే 5 కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. ప్రస్తుతం PMGKAY మార్చి 2022 వరకు నాలుగు నెలల పాటు పొడిగించబడింది. 

34

దీని వల్ల ఖజానాపై రూ. 53,344 కోట్ల అదనపు భారం పడుతుందని, ఈ పొడిగింపుతో కలిపి పీఎంజీకేఏవై మొత్తం వ్యయం రూ.2.6 లక్షల కోట్లకు చేరుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. COVID-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి PMGKAY మూడు నెలలు (ఏప్రిల్-జూన్ 2020) మంజూరు చేసింది. అయినప్పటికీ సంక్షోభం కొనసాగడంతో ఈ పథకం మరో ఐదు నెలలు (జూలై-నవంబర్ 2020) పొడిగించారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను నవంబర్ 30 తర్వాత పొడిగించే ప్రతిపాదన లేదని నవంబర్ 5న ఆహార కార్యదర్శి ప్రకటనలో  పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రికవరీ దిశగా పయనిస్తోందని అన్నారు. అటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపుకు ఎటువంటి ప్రణాళిక లేదని తెలిపింది. 

44

కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను మార్చి 2020లో ప్రకటించారు. మొదట్లో ఈ పథకం ఏప్రిల్-జూన్ 2020 కాలానికి ప్రారంభించబడింది, అయితే తర్వాత దానిని నవంబర్ 30 వరకు పొడిగించారు.

కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీపై కీలక నిర్ణయం
దీనితో పాటు దాద్రా, నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలలో విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేటీకరించడానికి ఒక కంపెనీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ షేర్లను అత్యధిక బిడ్డర్లకు విక్రయించి ఉద్యోగుల బాధ్యతలను తీర్చేందుకు ట్రస్టు ఏర్పాటుకు ఆమోదం లభించింది. 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Recommended image2
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image3
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved