MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అద్దె ఇంట్లో ఉంటూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. ట్విట్టర్ సి‌ఈ‌ఓ గురించి మీకు తెలియని విషయాలు..

అద్దె ఇంట్లో ఉంటూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో.. ట్విట్టర్ సి‌ఈ‌ఓ గురించి మీకు తెలియని విషయాలు..

ట్విట్టర్ సి‌ఈ‌ఓ పరాగ్ అగర్వాల్(parag agarwal) తాజాగా జాక్ డోర్సే స్థానంలో నూతన సి‌ఈ‌ఓగా నియమితులైన సంగతి మీకు తెలిసిందే. అయితే  పరాగ్ అగర్వాల్ ఎక్కడ జన్మించాడు.. చదువు ఎక్కడ పూర్తి చేశాడు ఈ వివరాలు మీకు తెలియకపోవచ్చు.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని ప్రభుత్వ జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రిలో జన్మించారు. అతని కుటుంబం అజ్మీర్‌కు చెందినది.

3 Min read
Ashok Kumar | Asianet News
Published : Dec 01 2021, 03:42 PM IST| Updated : Dec 01 2021, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

1984లో అతని తండ్రి రామ్ గోపాల్ ముంబైలో పనిచేసేవాడు, కానీ అతను తన భార్యను డెలివరీ కోసం అజ్మీర్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు పంపాడు. ఆ సమయంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ చేయించే అంతా స్థోమత అతనికి లేదు. కానీ నేడు పరాగ్ అగర్వాల్ ప్రపంచంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ట్విట్టర్‌కి సి‌ఈ‌ఓ అయిన తరువాత అతని కృషి, త్యాగం ఫలించింది.

పరాగ్ అగర్వాల్ తల్లిదండ్రులు రామ్ గోపాల్, శశి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. డిసెంబర్ 4న ఆయన అజ్మీర్‌కు వస్తారని, అక్కడ ఆయనకు సన్మానం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. నగరంలోని రద్దీగా ఉండే ధన్‌మండి, ప్రసిద్ధ దర్గా నుండి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న ఖజానా గలిలో పరాగ్ అగర్వాల్ తాతయ్యలు అద్దె ఇంట్లో నివసించారని పరాగ్ అగర్వాల్ కుటుంబానికి చెందిన సన్నిహితులు తెలిపారు. మరోవైపు తండ్రి రామ్ గోపాల్ పని నిమిత్తం ముంబైకి రావాల్సి వచ్చింది.
 

26

కోట్లలో జీతం అలాగే బోనస్-స్టాక్స్
యూ‌ఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో ట్విట్టర్ విడిగా ఇచ్చిన సమాచారం ప్రకారం పరాగ్ అగర్వాల్  జీతం $ 1 మిలియన్ అంటే సంవత్సరానికి రూ. 7.50 కోట్లు. 37 ఏళ్ల పరాగ్‌కు రూ.94 కోట్ల విలువైన కంపెనీ బోనస్, రిస్ట్రిక్టెడ్ స్టాక్ ఇవ్వబడుతుంది. అలాగే అనుకున్నట్లు జరిగితే ప్రత్యేక స్టాక్స్ కూడా ఇవ్వబడతాయి. కంపెనీకి 10 సంవత్సరాలు సేవలందించినందుకు ప్రతిఫలంగా అతనికి గతంలో స్టాక్‌లు ఇచ్చారు, అయితే వాటి ధర లేదా వాల్యును వెల్లడించలేదు.

మాజీ సీఈవో జాక్ డోర్సీ
ట్విట్టర్ మాజీ సి‌ఈ‌ఓ 106 రూపాయల జీతం తీసుకునేవారు. అయితే వేల కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించాడు. దాదాపు రూ.2.78 లక్షల కోట్ల విలువైన ట్విట్టర్ కంపెనీలో ఆయనకు 2.26 శాతం వాటా ఉంది. 2009లో అతను ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన స్క్వేర్‌ని సృష్టించాడు, ఈ కంపెనీ  ట్విట్టర్ (Twitter) కంటే మూడు రెట్లు పెద్దది, దీనిలో జాక్ డోర్సీ కి 11 శాతం వాటా  కలిగి ఉన్నాడు.

36

ఎలాన్ మస్క్ మాట్లాడుతూ - భారతీయుల 'బాల్య స్నేహితురాలు' శ్రేయా ఘోషల్
పరాగ్‌ అగర్వాల్ ట్విట్టర్ సిఇఒగా మారిన తరువాత అతనికి అభినందనలు తెలుపుతూ ఫైనాన్స్ కంపెనీ స్ట్రైప్ సిఇఒ ప్యాట్రిక్ కొల్లిసన్ ఒక ట్వీట్ చేశారు.  'అమెరికాకు చెందిన ఆరు ప్రధాన టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబిఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సిఇఒలతో సహ ఇప్పుడు ట్విట్టర్ సి‌ఈ‌ఓ కూడా భారతీయుడే.

టెక్నాలజి ప్రపంచంలో భారతీయుల ఈ అద్భుతమైన విజయాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంది. దీనికి ప్రపంచంలోని ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ 'భారత్ ప్రతిభావంతుల వల్ల అమెరికా చాలా లాభపడింది' అని రీట్వీట్ చేశాడు.

46

సింగర్ శ్రేయా ఘోషల్ పరాగ్‌ అగర్వాల్ ట్విట్టర్ సి‌ఈ‌ఓ కావడం అనేది గర్వించదగ్గ విషయమని అభినందించారు. శ్రేయ ఘోషల్, పరాగ్  అగర్వాల్ పాత స్నేహితులు కావడం గమనార్హం. 2010లో పరాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ 'బాల్య స్నేహితుడి'ని ఫాలో అవ్వమని శ్రేయ ఘోషల్  తన ఫాలోవర్స్ ని కోరింది.

అదే సమయంలో మే 2020 నుండి ట్విట్టర్‌లో నిషేధించబడిన సినీ నటి కంగనా రనౌత్  జాక్ డోర్సీ కోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'బై అంకుల్ జాక్...' అని పోస్ట్ చేసింది. పరాగ్ అగర్వాల్ నియామకం ట్విట్టర్ భవిష్యత్తుకు ప్రోత్సాహకరమైన వార్త అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

56

ఐఐటీ బాంబేలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ సుప్రతిమ్ బిస్వాస్ పరాగ్‌ అగర్వాల్ ను 'టాపర్ మెటీరియల్' అని అన్నారు. అతను చాలా పద్ధతిగల మంచి ప్రవర్తన కలిగిన విద్యార్థి అని చెప్పాడు.
 ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాశిష్ చౌదరి ప్రకారం, పరాగ్ అగర్వాల్ సంస్థ గర్వపడేలా చేసింది.
పరాగ్ తండ్రి ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో పనిచేశారు అలాగే ముంబైలో జన్మించిన ఆతని తల్లి స్కూల్ టీచర్‌గా పదవీ విరమణ చేశారు. 

66

అగర్వాల్ 1999 నుండి 2001 వరకు ముంబైలోని అటామిక్ ఎనర్జీ స్కూల్ నంబర్. 4లో 11, 12 తరగతులు చదివాడు. ఇక్కడి ప్రిన్సిపాల్‌ ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ఐఐటీకి వెళ్లాలనుకుంటున్నానని చెప్పేవాడని చెప్పారు. అతను ఎల్లప్పుడూ తన ప్రాజెక్ట్‌లకు కొత్తదనం తెచ్చేవాడు అని తెలిపారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved