MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెళ్లికి.. బస్సు కంటే ట్రైన్ బుక్ చేసుకోవడం ఎంతో బెటర్. ఎందుకో తెలుసా?

పెళ్లికి.. బస్సు కంటే ట్రైన్ బుక్ చేసుకోవడం ఎంతో బెటర్. ఎందుకో తెలుసా?

పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది. మీరు మీ బంధువులందరితో కలిసి పెళ్లి జరిగే చోటుకు వెళ్లడానికి ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లలో ఉన్నారా? ఎలా వెళ్లాలని ఆలోచిస్తున్నారా? ప్రైవేట్ బస్ బుక్ చేసుకోవడం, కార్లలో వెళ్లడం, లేదా ట్రైన్ బోగీ బుక్ చేసుకోవడం ఇలా మీకు అనేక ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ మీకు ఏ ట్రాన్స్ పోర్ట్ అయితే తక్కువ ఖర్చు అవుతుందో తెలుసుకోండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Oct 24 2024, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పెళ్లిళ్ల సీజన్‌లో ఎక్కువగా బస్సులు బుక్ చేసుకొని పెళ్లి వారు, బంధువులు ట్రావెల్ చేస్తుంటారు కదా. ఇలా బస్ బుక్ చేసుకున్నందుకు దూరాన్ని బట్టి దాదాపు రూ.25 వేల నుంచి బస్సు ఛార్జీలు ఉంటాయి. అయితే మీరు కూడా పెళ్లి వేడుకకు సిద్ధమవుతుంటే ఏ ట్రాన్స్ పోర్ట్ మంచిదో ఇక్కడ మీకు మంచి సమాచారం ఉంది.  

సాధారణంగా పెళ్లి బస్సులకు ఎక్కువ ఛార్జ్ తీసుకుంటారు. కి.మీ. బట్టి ఛార్జ్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్రయాణించాల్సి వస్తే చాలా మంది ట్రైన్ బోగీలు బుక్ చేసుకుంటారు. సుమారు 70, 80 మంది ఉంటే ఫుల్ బోగీ బుక్ చేసుకుంటారు. దీని వల్ల అదనపు ఛార్జీలు ఎక్కువ పడతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దూర ప్రయాణాలకు రైలే బెస్ట్. మొత్తం బోగీ బుక్ చేసుకోవడం లాభమా? లేక సింగిల్ సీట్లు బుక్ చేసుకోవడం బెటరో తెలిస్తే మీరు ఆశ్చర్య పోతారు. రెండింటికీ చాలా తేడా ఉంది. రైల్వే డిపార్ట్ మెంట్ ఇచ్చిన సమాచారం మేరకు సింగిల్ సీట్ బుక్ చేసుకుంటే కేవలం రైల్వే ఛార్జీలే తీసుకుంటారు. ఇతర ఛార్జీలు ఉండవు.

కానీ మొత్తం బోగీ లేదా రైలు బుక్ చేసుకుంటే చాలా రకాల ఛార్జీలు చెల్లించాలి. ఇది చాలా ఖరీదు. నిపుణులు చెప్పిన దాని ప్రకారం సింగిల్ సీట్ బుకింగ్‌తో పోలిస్తే మొత్తం బోగీ బుకింగ్‌కి దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి సింగిల్ సీట్లు బుక్ చేసుకోవడమే చవక.

35

రైళ్లలో ప్రయాణించడానికి మొత్తం బోగీని బుక్ చేసుకోవడం కంటే సింగిల్ సీట్లు బుక్ చేసుకోవడం చాలా చవక. మొత్తం బోగీ బుకింగ్‌కి అదనపు ఛార్జీలు, పన్నులతో సహా మూడు రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. కానీ ఒకే పీఎన్ఆర్‌లో ఆరుగురికి మించి టిక్కెట్లు బుక్ చేసుకోలేము. కాబట్టి విడివిడిగా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

కానీ ఒకే పీఎన్ఆర్‌లో ఆరు టిక్కెట్ల కన్నా ఎక్కువ బుక్ చేయలేం. అందుకే విడివిడిగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. 72 సీట్లకు 12 మంది ఒకేసారి బుక్ చేసుకున్నా, వేర్వేరు బోగీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఒకేసారి టిక్కెట్లు బుక్ అవుతూ ఉంటాయి. బోగీ లేదా రైలు బుకింగ్ పూర్తి ఛార్జీలతో (FTR) జరుగుతుంది.

45

మీరు కనుక రైలు బోగీని బుక్ చేసుకుంటే ఒక బోగీకి రూ.50,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ప్రయాణం మొదలు నుంచి చివరి వరకు అనేక ఇతర ఛార్జీలు చెల్లించాలి. 30% సర్వీస్ ఛార్జీ ఉంటుంది. ప్రయాణం కనీసం 200 కి.మీ. ఉండాలి. బోగీని మీరు ఎక్కడైనా ప్రత్యేకంగా ఆపితే దానికి విడిగా ఛార్జీలు చెల్లించాలి. ఏసీ, ఫస్ట్ క్లాస్ బోగీలకేతే  5% GST ఉంటుంది. సూపర్‌ఫాస్ట్ రైలు అయితే సూపర్‌ఫాస్ట్ ఛార్జీలు కూడా ఉంటాయి. మొత్తం రైలు బుక్ చేసుకుంటే ఇంజన్ ఆపడానికి కూడా ఛార్జీలు చెల్లించాలి.

55

ఇలా రైల్వే బోగీ బుక్ చేసుకుంటే మీరు చాలా ఖర్చవుతుంది. అయితే చాలా సరదాగా మీ ప్రయాణం సాగుతుంది. బంధువులు, స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా మీరు ప్రయాణం చేయవచ్చు. ఖర్చుతో మీకు ఇబ్బంది లేకపోతే ఐఆర్‌సీటీసీ ద్వారా బోగీలు లేదా రైళ్లు బుక్ చేసుకోవచ్చు. మొత్తం బుకింగ్‌పై 5% లెవీ ఛార్జీ ఉంటుంది. కనీసం ఒక నెల ముందు, గరిష్టంగా ఆరు నెలల ముందు మీరు రైల్వే బోగీలు బుక్ చేసుకోవచ్చు.

అయితే మీరు ఖర్చు తగ్గించుకోవాలంటే బోగీల కంటే సింగిల్ సీట్లు బుక్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఇతర ఛార్జీలు కూడా ఏమీ ఉండవు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Rules: ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే అకౌంట్‌లో డ‌బ్బులు ఏమ‌వుతాయి.? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయిa
Recommended image2
Gold Rate Today: బంగారం ఇంత చవకా? తులం పసిడి ఎంత తగ్గిందో తెలుసా? సిల్వర్ కూడా పతనమైంది
Recommended image3
Indian Railway: రైలు క‌ద‌ల‌గానే జ‌ర్క్ ఎందుకు ఇస్తుంది.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved