MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • స్టాక్ మార్కెట్ టుడే: సెన్సెక్స్ 100 పాయింట్లు బ్రేక్, క్షీణించిన నిఫ్టీ..

స్టాక్ మార్కెట్ టుడే: సెన్సెక్స్ 100 పాయింట్లు బ్రేక్, క్షీణించిన నిఫ్టీ..

నేడు కొత్త ఏడాది మొదటి  వారంలోని మూడో ట్రేడింగ్ రోజున బుధవారం స్టాక్ మార్కెట్  (stockmarket)లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. బి‌ఎస్‌ఈ (bse)30-షేర్ సెన్సెక్స్ (sensex)అండ్ ఎన్‌ఎస్‌ఈ  నిఫ్టీ(nifty) రెండు సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 59,900 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 17,813 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Jan 05 2022, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అయితే కొంతకాలంగా ట్రేడింగ్‌లో రెండు సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 103 పాయింట్లు పతనమై 59,752 వద్దకు చేరుకోగా, నిఫ్టీ కూడా 30 పాయింట్లు జారి 17,775 స్థాయికి చేరుకుంది. 

నిన్న 672 పాయింట్ల పెరుగుదల 
స్టాక్ మార్కెట్ వరుసగా రెండవ ట్రేడింగ్ రోజు ప్రకాశవంతంగా మొదలైంది. మంగళవారం కూడా మార్కెట్‌లో ట్రేడింగ్‌ జోరుగా సాగింది. సెన్సెక్స్, నిఫ్టీలు గ్రీన్‌మార్క్‌లో ప్రారంభమైన తర్వాత లాభాలతో ట్రేడయ్యాయి. చివరకు బిఎస్‌ఇ 30-షేర్ సెన్సెక్స్ 672 పాయింట్ల లాభంతో 59,856 వద్ద, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 180 పాయింట్ల లాభంతో 17,805 వద్ద ముగిశాయి. 

24

సోమవారం జంప్ 
 2022 సంవత్సరం మొదటి ట్రేడింగ్ రోజు సోమవారం స్టాక్ మార్కెట్ మంచి లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 929 పాయింట్ల జంప్‌తో 59,183 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా బలమైన లాభాలతో ట్రేడింగ్ ముగిసే సమయానికి 271 పాయింట్ల లాభంతో 17,625 వద్ద ముగిసింది. 

34

ఒమిక్రాన్‌ వైరస్‌ భారతదేశాన్ని వణికిస్తోంది. దీంతో క్రమంగా కఠినమైన ఆంక్షలు ఒక్కో రాష్ట్రంలో అమల్లోకి వస‍్తున్నాయి. ప్రతికూలతలు చుట్టు ముట్టినా ఈ ఏడాది ఆరంభం నుంచి స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాటలోనే ఉంది. బుధవారం సైతం అదే ట్రెండ్‌ కనిపిస్తోంది. దేశీ సూచీలు జోరుగా లాభాల్లోకి వెళ్లకున్నా  నష్టాల దిశగా అయితే వెళ్లలేదు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నా ప్రతికూల పరిస్థితులు బ్రేకులు వేస్తున్నాయి. ఫలితంగా మార్కెట్‌లో వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. 

44

ఈరోజు ప్రారంభంలో ఆసియా మార్కెట్లు తక్కువగా ట్రేడవుతుండగా, యూ‌ఎస్ స్టాక్ మార్కెట్ రాత్రిపూట ట్రేడింగ్‌లో మిశ్రమంగా స్థిరపడింది.పెరుగుతున్న కోవిడ్-19 కేసులపై ఆందోళనలు, రాష్ట్రాలు ఆంక్షల ప్రకటనలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సింగపూర్ ఎక్స్ఛేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ 59.50 పాయింట్లు లేదా 0.33 శాతం పడిపోయి 17,815.50 వద్ద ట్రేడవుతున్నాయి,

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved