MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 20 రూపాయలకే రూ.2 లక్షల ప్రమాద బీమా: ఎక్కడో తెలుసా?

20 రూపాయలకే రూ.2 లక్షల ప్రమాద బీమా: ఎక్కడో తెలుసా?

కేవలం రూ.20 కడితే ప్రమాద బీమా పొందే అవకాశం ఇక్కడ ఉంది. ఈ బీమా పాలసీ ద్వారా లబ్ధిదారులకు రూ.2 లక్షల వరకు లభిస్తాయి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పాలసీ ఎక్కడ కట్టాలో వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Naga Surya Phani Kumar
Published : Nov 21 2024, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జీవితంలో ఎవరు, ఎప్పుడు, ఏ సమస్యను ఎదుర్కొంటారో చెప్పలేం. కాబట్టి ఏదైనా ఊహించని పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ కాలంలో బీమా చాలా ముఖ్యమైన అవసరంగా మారింది. ప్రమాదాలు చెప్పి రావు కాబట్టి యాక్సిడెంటల్ పాలసీలు తీసుకోవడం చాలా అవసరం. 

అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు బీమా పాలసీకి ప్రీమియం చెల్లించలేక ఇబ్బంది పడవచ్చు. వారికి ఇన్యూరెన్స్ ద్వారా రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY).

24

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. దీనికి ప్రీమియం కూడా చాలా తక్కువ. అందరూ సులభంగా చెల్లించవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి సంవత్సరానికి రూ. 20 మాత్రమే ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది.

భారతదేశంలోని అత్యధిక జనాభాకు భద్రతా బీమాను అందించడమే ఈ పథకం లక్ష్యం. గతంలో ఈ పథకం వార్షిక ప్రీమియం రూ. 12గా ఉండేది. ఇది జూన్ 1, 2022 నుండి రూ. 20కి పెంచారు. ధరలు, ఆదాయాలు పెరిగిన నేపథ్యంలో ఇది కూడా తక్కువ ప్రీమియం అనే చెప్పొచ్చు. కాబట్టి పేద ప్రజలు కూడా సులభంగా ఈ పాలసీ తీసుకోవచ్చు. 

34

ప్రమాదంలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే వారి నామినీకి బీమా నగదు మొత్తం అందుతుంది. 18 ఏళ్ల నుండి 70 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. లబ్ధిదారుని వయస్సు 70 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఈ పాలసీ లభించదు. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీకి ముందు పాలసీ అమౌంట్ ఆటో డెబిట్ అవుతుంది. 

ఈ పథకం కింద బీమా చేసిన వ్యక్తి తీవ్రంగా గాయపడినా రూ.2 లక్షలు అందుతాయి. కళ్ళు, చేతులు, కాళ్ళు కోల్పోయినా రూ. 2 లక్షలు అందుతాయి. శాశ్వత పాక్షిక వైకల్యం కలిగితే రూ. 1 లక్ష వరకు లభిస్తుంది.

44

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ. 20 ఒక సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది. ఆ తర్వాత పథకాన్ని రిన్యూవల్ చేయించుకోవాలి. ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం కలిగితే నిబంధనల ప్రకారం బీమా మొత్తం అందిస్తారు. 

పాలసీదారుని వయస్సు 18 నుండి 70 ఏళ్ల మధ్య ఉండాలి. పాలసీదారుడు సేవింగ్స్ ఖాతాను ఎల్లప్పుడూ యాక్టివేషన్ లో ఉంచాలి. అకౌంట్ మూసివేస్తే పాలసీ కూడా రద్దు అవుతుంది. ప్రీమియంను సేవింగ్స్ ఖాతా నుండి ఆటో డెబిట్ చేయడానికి అనుమతి పత్రంపై సంతకం చేయాలి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate: బంగారం కొంటే భారీ ధర.. అమ్మితే తక్కువ ధర, ఎందుకు ఈ తేడా?
Recommended image2
Pets in Train: మీ పెంపుడు జంతువులను రైలులో తీసుకువెళ్లాలనుకుంటున్నారా? ఇలా టికెట్ బుక్ చేయండి
Recommended image3
Business Ideas : కేవలం వేలల్లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఇంటి నుండే లక్షలు సంపాదించవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved