వీకెండ్ రిలీఫ్.. స్థిరంగా ఇంధన ధరలు.. మీ నగరంలో లీటరు ధర ఎంతంటే..?
ప్రతిరోజూ లాగానే ప్రభుత్వ చమురు కంపెనీలు ఈరోజు (శనివారం) ఉదయం 6 గంటలకు పెట్రోల్-డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. 28 మే 2022న కూడా జాతీయ మార్కెట్లో వాహన ఇంధనం (పెట్రోల్-డీజిల్) ధరలో ఎటువంటి మార్పు లేదు, ఈ కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
అంతకుముందు మే 21న నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు లీటరు భారీగా దిగోచ్చింది.
భారతీయ చమురు సంస్థ IOCL తాజా అప్ డేట్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 28 మే 2022న లీటరు పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో పెట్రోల్ లీటరుకు రూ. 96.35, డీజిల్ రూ. 89.52 వద్ద స్థిరంగా ఉంది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లీటర్ పెట్రోల్ ధర ఈరోజు రూ.96.57గా ఉంది. కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35. రెండు రాష్ట్రాల మధ్య పెట్రోల్ ధరలో రూ.14.78 వ్యత్యాసం ఉంది.
గత వారం నుండి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం శనివారం (మే 21) పెట్రోల్-డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత, చమురు ధరలు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. మీరు ప్రతిరోజూ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు.
Pakistan Petrol Price, Diesel Price, Fuel Price, Oil Price
ఈరోజు ప్రధాన మెట్రోలలో పెట్రోల్ మరియు డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం
నగరం పెట్రోలు డీజిల్
ఢిల్లీ 96.72 89.62
ముంబై 111.35 97.28
చెన్నై 102.63 94.24
కోల్కతా 106.03 92.76
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఆధారంగా, చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్డేట్ చేస్తాయి.