MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Best Post office Sceme: మీరు పెట్టే డబ్బులు రెట్టింపు చేసే పోస్టాఫీస్ స్కీమ్ ఇదిగో

Best Post office Sceme: మీరు పెట్టే డబ్బులు రెట్టింపు చేసే పోస్టాఫీస్ స్కీమ్ ఇదిగో

Best Post office Sceme: పోస్టాఫీసు స్కీములు ఎంతో సురక్షితమైనవి. కిసాన్ వికాస్ పత్రా స్కీములో రెట్టింపు లాభాలు అందుతాయి. దీనిలో వచ్చే వడ్డీ ఎంతో తెలుసుకోండి. 

2 Min read
Haritha Chappa
Published : Nov 13 2025, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బెస్ట్ పోస్టాఫీసు స్కీమ్
Image Credit : India post

బెస్ట్ పోస్టాఫీసు స్కీమ్

పోస్టాఫీసు పథకాల్లో కిసాన్ వికాస్ పత్రా పథకం ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఈ పథకం ద్వారా పెట్టుబడి చేసిన డబ్బు నిర్దిష్ట కాలంలో రెట్టింపు అవుతుంది. కాబట్టి భద్రతతో పాటు స్థిరమైన లాభాలు కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. కిసాన్ వికాస్ పత్రా అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఒక చిన్న పొదుపు పథకం. ఇందులో కనీసంగా 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తం కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. మీరు ఎంతైన పెట్టుకోవచ్చు.

24
ఎంత వడ్డీ వస్తుంది?
Image Credit : India post

ఎంత వడ్డీ వస్తుంది?

ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 7.5 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఈ వడ్డీ చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. అంటే వడ్డీ కూడా మళ్లీ వడ్డీకి చేరుతుంది. అందువల్ల పెట్టుబడి చేసిన డబ్బు సుమారు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాలు 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. కాబట్టి మీరు పెట్టిన డబ్బులు ఇక్కడ డబుల్ అవుతాయి. పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై లక్షల రూపాయలు చేతికి అందుతాయి. కిసాన్ వికాస్ పత్రా పథకానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. అంటే దీనికి స్టాక్ మార్కెట్ మార్పులతో సంబంధం లేదు. పూర్తి భద్రత కలిగిన పథకంగా చెప్పుకోవచ్చు. బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పులు వచ్చినా, మీరు పెట్టిన డబ్బు, వడ్డీ సురక్షితంగా ఉంటాయి. అందుకే గ్రామీణులు, రిస్క్‌ తీసుకోని పెట్టుబడిదారులు ఎక్కువగా ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు.

Related Articles

Related image1
9 Carats Gold: 9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి? దీని ధర ఎంత ఉంటుంది? హాల్ మార్క్ వస్తుందా?
Related image2
TATA Trust: రతన్ టాటా వారసుడిగా యువ వ్యాపారవేత్త నెవిల్ టాటా? ఎవరు ఈ యువకుడు?
34
బ్యాంక్ లోన్ కూడా వస్తుంది
Image Credit : India post

బ్యాంక్ లోన్ కూడా వస్తుంది

ఈ పథకం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. నామినీ సౌకర్యం ఉంది. పెట్టుబడిదారు మరణించిన తర్వాత నామినీకి డబ్బు అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన పత్రాన్ని ఒక వ్యక్తి నుండి మరొకరికి బదిలీ చేయవచ్చు. అవసరమైతే ఈ పత్రాన్ని బ్యాంకు లోన్‌కు తాకట్టు పెట్టుకుని లోన్ తీసుకోవచ్చు. దేశంలోని ఏ పోస్టాఫీసులోనైనా ఈ పథకాన్ని తీసుకోవచ్చు లేదా వేరే బ్రాంచ్‌కి బదిలీ చేయవచ్చు.

44
ఎప్పుడు డబ్బులు తీసుకోవచ్చు?
Image Credit : India post

ఎప్పుడు డబ్బులు తీసుకోవచ్చు?

సాధారణంగా ఈ పథకానికి లాక్ ఇన్ పీరియడ్‌ 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టాక 30 నెలల కన్నా ముందు డబ్బు వెనక్కి తీసుకోలేరు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే పెట్టుబడిదారు మరణించి నప్పుడు, కోర్టు ఆదేశాల సమయంలో ముందుగా తీసుకునే అవకాశం ఉంటుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved