MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Jio వినియోగదారులకు షాక్: డేటా ప్యాక్‌ వ్యాలిడిటీలు తగ్గిపోయాయ్

Jio వినియోగదారులకు షాక్: డేటా ప్యాక్‌ వ్యాలిడిటీలు తగ్గిపోయాయ్

జియో తన కస్టమర్లపై మరోసారి రీఛార్జ్ భారం మోపుతోంది. కొన్ని డేటా వోచర్ల వ్యాలిడిటీ తగ్గిస్తూ రిలయన్స్ జియో నిర్ణయం తీసుకుంది. దీని వల్ల జియో వినియోగదారులు తరచూ డేటా ప్లాన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఏ వోచర్ల వ్యాలిడిటీ తగ్గించిందో తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 27 2024, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారతదేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో మరోసారి తన కస్టమర్లపై డేటా ప్లాన్ భారం మోపుతోంది. జియోలో అత్యంత తక్కువ డేటా వోచర్‌లైన రూ.19, రూ.29ల వ్యాలిడిటీలో ప్రధాన మార్పులు చేసింది. టెంపరరీ డెేటా కోసం ఈ డేటా వోచర్‌లే చాలా మంది రిలయన్స్ జియో కస్టమర్‌లు ఉపయోగిస్తుంటారు. తాజాగా వీటి వ్యాలిడిటీ టైమ్ ని తగ్గిస్తూ రిలయన్స్ నిర్ణయం తీసుకుంది.

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

కొన్ని నెలల క్రితం వరకు రూ.19 వోచర్ రూ.15లకు, రూ.29 వోచర్ రూ.25కి లభించేది. 2024 సంవత్సరం ప్రారంభంలో అమలు చేసిన టారిఫ్ పెంపుదల వల్ల ఈ వోచర్‌ల ధర కూడా పెరిగిపోయింది. 

రూ.19 డేటా వోచర్ రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారుడి బేసిక్ ప్లాన్ ఉన్నంత వరకు చెల్లుబాటు అయ్యేది. అంటే.. వినియోగదారు బేసిక్ ప్లాన్ 70 రోజుల వరకు చెల్లుబాటు అయితే, అతను రూ.19 డేటా వోచర్ కూడా వేయించుకుంటే 70 రోజులు లేదా డేటా పూర్తిగా ఉపయోగించే వరకు పని చేసేది. అయితే ఇప్పుడు రూ.19 డేటా వోచర్ వ్యాలిడిటీని కేవలం 1 రోజుకు పరిమితం చేశారు. కాబట్టి రూ.19 డేటా వోచర్ కొత్త వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే. రోజు దాటితే అందులో డేటా మిగిలిపోయినా తర్వాత ఉపయోగించడానికి అవకాశం ఉండదు. 

34

అదేవిధంగా రూ.29 డేటా వోచర్‌ కూడా గతంలో వినియోగదారు బేసిక్ యాక్టివ్ ప్లాన్ ఎంత కాలం వ్యాలిడిటీ ఉంటుందో అంతకాలం డేటా ఉన్నంత వరకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు దీని వ్యాలిడిటీని కూడా మార్చారు. రూ.29 డేటా వోచర్ వేయించుకుంటే ఇప్పుడు కేవలం 2 రోజుల వరకు మాత్రమే సర్వీస్ లభిస్తుంది. ఆ తర్వాత డేటా మిగిలిపోయినా ఉపయోగించుకోవడానికి వీలు కాదు. 

44

ఈ ప్లాన్‌ల వ్యాలిడిటీకి జియో పెంచడం వెనుక కస్టమర్‌ల నుండి ఎక్కువ ఆదాయాన్ని కంపెనీ ఆశిస్తోందని అర్థమవుతోంది. డేటా వోచర్ల ధరలు పెంచకపోయినా వ్యాలిడిటీ తగ్గించడం వల్ల ఇప్పుడు అవసరమైనప్పుడల్లా రూ.19 రూ.29 రీఛార్జ్ చేసుకోవాలన్న మాట. గతంలో అయితే ఒకసారి రూ.19 గాని, రూ.29 తో గాని రీఛార్జ్ చేసుకుంటే బేసిక్ ప్లాన్ ఉన్నంత వరకు అందులో ఉండే డేటాను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. ఇకపై అలా కుదరదు. డేటా అవసరమైన ప్రతిసారి రీఛార్జ్ చేసుకోవాల్సిందే. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది? వడ్డీ భారం నుంచి ఎలా తప్పించుకోవాలి?
Recommended image2
SIP Investment : నెలకు ₹10 వేల పెట్టుబడితో ₹4.7 కోట్ల రిటర్న్స్.. కోటీశ్వరులు కావాలంటే ఇది చూడాల్సిందే!
Recommended image3
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved