MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో ఉచిత సేవలు..

జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో ఉచిత సేవలు..

Jio, Airtel Flood Relief: వరద ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులకు ఊరట ఇచ్చేలా జియో, ఎయిర్‌టెల్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులకు ఉచిత డాటా, కాలింగ్ సర్వీసులు అందించేందుకు జియో, ఎయిర్‌టెల్ ముందుకొచ్చాయి. 

2 Min read
Author : Rajesh K
Published : Aug 28 2025, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారీ వర్షాలు, వరదలు
Image Credit : Asianet News

భారీ వర్షాలు, వరదలు

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి, దీంతో అనేక జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాళా తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి, జన జీవనం స్థంభించింది. ఈ తరుణంలో జియో, ఎయిర్‌టెల్ ముందుకొచ్చాయి తమ వినియోగదారులకు మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయమేంటీ?

26
జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం
Image Credit : Gemini

జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం

వరద ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులకు ఊరట ఇచ్చేలా జియో, ఎయిర్‌టెల్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులకు ఉచిత డాటా, కాలింగ్ సర్వీసులు అందించేందుకు జియో, ఎయిర్‌టెల్ ముందుకొచ్చాయి. సహాయక చర్యల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సర్వీసులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

Related Articles

Related image1
Jio vs Airtel vs Vi: తక్కువ ధరలో బెస్ట్ అన్‌లిమిటెడ్ 5G ప్లాన్స్ ఇవే..
Related image2
Reliance Jio : కేవలం రూ.100 రీచార్జ్ తో రూ.299 ప్లాన్ బెనిఫిట్స్ పొందండిలా
36
జియో ప్రకటన
Image Credit : ANI

జియో ప్రకటన

భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లోని రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లకు తాత్కాలిక సాయం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని ప్రీపెయిడ్ ప్లాన్‌ల వ్యాలిడిటీని 3 రోజుల పాటు ఆటోమేటిక్‌గా పొడిగిస్తామని జియో అధికారులు తెలిపారు. దీనివల్ల, వినియోగదారులు తక్షణ రీఛార్జ్ అవసరం లేకుండా నిరంతరంగా నెట్‌వర్క్ సేవలను ఉపయోగించగలుగుతారు. 

ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్ని కాల్స్ ఉచితంగా లభిస్తాయని జియో పేర్కొంది. వీటితో వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఇంటర్నెట్ బ్రౌజింగ్, వాయిస్ కాల్స్, మాస్‌జింగ్, ఇతర డిజిటల్ అవసరాలను కొనసాగించవచ్చు. ఈ నిర్ణయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో వినియోగదారులు ఎలాంటి కనెక్టివిటీ సమస్యలు లేకుండా తమ మొబైల్ & డేటా సేవలను ఉపయోగించగలుగుతారు.

46
ఎయిర్‌టెల్ ప్రకటన
Image Credit : x

ఎయిర్‌టెల్ ప్రకటన

ఎయిర్ టెల్ కూడా కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ప్రత్యేక సహాయక చర్యలను ప్రకటించింది. ఈ చర్యల ప్రకారం ప్రీపెయిడ్ కస్టమర్ల ప్లాన్ల వ్యాలిడిటీని 3 రోజుల పాటు ఆటోమేటిక్‌గా పొడిగించబడుతుంది. ఈ చర్య ద్వారా తక్షణ రీఛార్జ్ అవసరం లేకుండా సేవలను కొనసాగించగలుగుతారు. 

ప్రీపెయిడ్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజుకు 1GB హై-స్పీడ్ డేటా కూడా అందించబడుతుంది. వీటితో, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా, మాసేజింగ్, వాయిస్ కాలింగ్ వంటి సేవలను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా సజావుగా ఉపయోగించవచ్చు. అలాగే, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు తమ బిల్లులను చెల్లించడానికి 3 రోజుల అదనపు సమయం (Grace Period) పొందుతారు. ఇది, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో బిల్లులు చెల్లించలేకపోయే వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది.

56
కేంద్రం సూచన – ఇంట్రా సర్కిల్ రోమింగ్ యాక్టివేషన్
Image Credit : social media

కేంద్రం సూచన – ఇంట్రా సర్కిల్ రోమింగ్ యాక్టివేషన్

జమ్మూ కాశ్మీర్, లడఖ్ , హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వినియోగదారుల కనెక్టివిటీని ప్రభావితం కాకుండా కొనసాగించేందుకు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అన్ని టెలికాం సంస్థలు ICR (Inter Circle Roaming)సేవలను సెప్టెంబర్ 2 వరకు యాక్టివ్‌గా ఉంచాలని ఆదేశించింది. ఈ నిర్ణయం  ద్వారా వినియోగదారులు తమ ప్రాథమిక టెలికాం ప్రొవైడర్ ద్వారా సర్వీస్ అందని సందర్భంలో కూడా మరొక సంస్థ నెట్‌వర్క్ సేవలను సజావుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో సిగ్నల్, కనెక్టివిటీ సమస్యలు ఎదురవుతున్న సందర్భంలో ఈ చర్య వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా అత్యవసర కాల్స్, డేటా, కమ్యూనికేషన్ సేవలను అందించడంలో సహాయపడుతుంది.

66
ప్రధాన ఉద్దేశమిదే..
Image Credit : pinterest

ప్రధాన ఉద్దేశమిదే..

కేంద్ర ప్రభుత్వం, టెలికాం నిర్ణయం ద్వారా వినియోగదారులు అంతరాయం లేకుండా కనెక్టివిటీ పొందగలుగుతారు. అత్యవసర కాల్స్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ప్రజలకు తక్షణ సమాచార మార్పిడి సౌకర్యం అందించబడుతుంది. ఉచిత డేటా, కాలింగ్, బిల్లు వాయిదా వంటి ప్రయోజనాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నివాసుల భారం తగ్గించేందుకు సహాయపడతాయి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
సాంకేతిక వార్తలు చిట్కాలు
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Related Stories
Recommended image1
Jio vs Airtel vs Vi: తక్కువ ధరలో బెస్ట్ అన్‌లిమిటెడ్ 5G ప్లాన్స్ ఇవే..
Recommended image2
Reliance Jio : కేవలం రూ.100 రీచార్జ్ తో రూ.299 ప్లాన్ బెనిఫిట్స్ పొందండిలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved