రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇప్పుడు ఆ సదుపాయాన్ని పొందాలంటే డబ్బులు చెల్లించాల్సిందే..
ఇండియన్ రైల్వే దేశంలోని సుమారు అన్నీ రైల్వే స్టేషన్ లలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఛార్జీలు చెల్లించక తప్పదు. రైల్టెల్ ఉచిత వై-ఫై సదుపాయాన్ని పొందడానికి తాజాగా ఒక కొత్త మార్గాన్ని సూచించింది. రైల్వే స్టేషన్లలో హై-స్పీడ్ వై-ఫైను ఉపయోగించుకోవాలంటే సామాన్యులకు కాస్త భారం కానుంది.
ఈ సదుపాయాన్ని వాడుకుకోవడానికి కనీసం రూ .10 వసూలు చేయనున్నారు. రైల్వే శాఖ 4,000 కి పైగా స్టేషన్ల కోసం పేమెంట్ వై-ఫై ప్రణాళికలను ప్రారంభించింది. మొదట ప్రయాణీకులు అరగంట పాటు ఉచిత వై-ఫై ప్రయోజనాన్ని పొందవచ్చు. అరగంట తర్వాత మీరు ఐదు జీబీ డేటా వరకు పది రూపాయలు చెల్లించాలి.
ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో 1 ఎంబిపిఎస్ స్పీడ్ తో అరగంట వరకు ఉచిత వై-ఫై సదుపాయాన్ని పొందవచ్చు, కాని అరగంట తరువాత కూడా ప్రయాణీకులు ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందాలనుకుంటే దానికి ఛార్జీలు చెల్లించాలి. ఇందుకోసం ఇంటర్నెట్ను అందించే రైల్టెల్ పేమెంట్ ప్లాన్ ఎంచుకోవాలి.
అన్నీ స్టేషన్లలో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. ఇప్పుడు ప్రయాణీకులకు 1 ఎమ్బిపిఎస్ స్పీడ్ తో ఉచిత వై-ఫై సౌకర్యం అందింస్తున్నారు, దీని తరువాత పేమెంట్ ప్లాన్ ద్వారా వై-ఫై సౌకర్యం 34 ఎమ్బిపిఎస్ వేగంతో ఉంటుంది. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కింద 5 జిబి డాటా ప్యాక్ కోసం రూ .10 ఫీజు వసూలు చేయబడుతుంది. 10 జీబీ డేటాను ఉపయోగించడానికి మీరు రోజుకు 15 రూపాయలు చెల్లించాలి అని రైల్టెల్ సిఎండి పునీత్ చావ్లా చెప్పారు.
అదేవిధంగా మీరు 5 రోజుల్లో 10 జీబీ డేటాను వాడలనుకుంటే మీరు రూ .20 చెల్లించాలి, 5 రోజుల్లో 20 జీబీ డేటాను వాడలనుకుంటే మీరు రూ .30 చెల్లించాలి. ప్రయాణీకులు పోస్ట్ పెయిడ్ ప్లాన్లో ఒక నెల ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రణాళిక ప్రకారం మీరు 60 జీబీ డేటా ప్యాక్ కోసం 70 రూపాయలు చెల్లించాలి.
అరగంట వరకు ఫ్రీ వై-ఫై ఉపయోగించిన తరువాత మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. దాని గేట్వే ద్వారా ఫీజు చెల్లించే సౌకర్యం ఉంటుంది. తాజాగా 7,950 కి పైగా స్టేషన్లలో అరగంటకు పైగా రైల్వే శాఖ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తుంది. కోవిడ్ -19 కి ముందు 29 మిలియన్ల మంది ఈ సదుపాయాన్ని పొందారు.