- Home
- Business
- Gold Rate: బంగారం ధర త్వరలోనే రూ. 75000 తాకే అవకాశం..కారణాలు తెలిస్తే పసిడి ప్రియులకు కన్నీళ్లు ఆగవు...
Gold Rate: బంగారం ధర త్వరలోనే రూ. 75000 తాకే అవకాశం..కారణాలు తెలిస్తే పసిడి ప్రియులకు కన్నీళ్లు ఆగవు...
బంగారం ధర పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధరలో రికార్డు స్థాయిని తాకే సాయి.. అతి త్వరలోనే బంగారం ధర 75000 దాటడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారతదేశంలో బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటే ఏప్రిల్ 1 నుంచి బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తోంది. భారతదేశంలో బంగారం ధరలు గురువారం కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ రాజధాని డిల్లీలోని బులియన్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.280 పెరిగి రూ.60,680కి చేరింది. గత ట్రేడింగ్ సెషన్లో 10 గ్రాముల బంగారం ధర రూ.60,400 వద్ద ముగిసింది.
ఇదిలా ఉంటే సరిగ్గా ఏప్రిల్ 22న ఈ సంవత్సరం అక్షయ తృతీయ ను నిర్వహించనున్నారు. అక్షయ తృతీయ అనేది హిందువులకు చాలా ముఖ్యమైన పండగ. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే సంవత్సరం అంతా శుభం జరుగుతుంది అని భావిస్తుంటారు అందుకే కనీసం ఒక గ్రాము బంగారం అయినా ఎందుకు ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. మరోవైపు అక్షయ తృతీయ సందర్భంగా బంగారు నగల తయారీపై ప్రత్యేక డిస్కౌంట్లను సైతం ఇచ్చేందుకు నగల షాపుల వారు తయారవుతున్నారు.
అక్షయ తృతీయ సందర్భంగా మీరు బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే అక్షయ తృతీయ నాటికి బంగారం ధర కనీసం 65000 అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా 2000 డాలర్లు దాటిపోయింది ఈ ధోరణి కొనసాగితే బంగారం ధర అతి త్వరలోనే 75 వేల మార్కు తాకడం తప్పనిసరి అవుతుందని . నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర 75000 మార్కును తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులే బంగారం ధర పెరుగుదలకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని బ్యాంకింగ్ సంక్షోభం కూడా పరోక్షంగా బంగారం ధర పెరుగుదలకు ఒక కారణంగా కనిపిస్తోంది. అమెరికా, యూరప్ మార్కెట్లలో ద్రవ్యోల్బణం కారణంగా కూడా బంగారం ధర భారీగా పెరగడానికి కారణం అవుతోంది.
అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో కూడా బలహీనత నెలకొంది. ఇది కూడా పరోక్షంగా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. మదుపుదారులు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధర ట్రాక్ రికార్డు చూసినట్లయితే వరుసగా, ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో మీరు మంచి పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నట్లయితే బంగారంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన సాధనం అని చెప్పవచ్చు. మీ మీ పెట్టుబడిలో సుమారు 25 శాతం వరకు బంగారంపై పెట్టుబడి పెట్టినట్లయితే మంచి రాబడి లభిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గడచిన 23 ఏళ్లలో మనం గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 15 రెట్లు పెరిగింది. 2000 సంవత్సరం బంగారం 10 గ్రాములకు గానూ 4400 ఉండగా, ప్రస్తుతం 62000 సమీపంలో ఉంది.