MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు మళ్లీ పెంపు.. 10గ్రా., ధర ఎంతంటే..?

పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు మళ్లీ పెంపు.. 10గ్రా., ధర ఎంతంటే..?

బంగారం ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. గురువారం లాగానే నేడు విలువైన పసుపు లోహం బంగారం ధర(gold price) పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం వంటి కారణాలతో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.570 పెరిగింది. 

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Nov 26 2021, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.47,155కి చేరుకుంది. గత ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి ధర  రూ.46,585 వద్ద ముగిసింది. ఎం‌సి‌ఎక్స్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.4% పెరిగి రూ.48,073కి చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ 0.4% పెరిగి కిలోకు రూ.63420కి చేరాయి. 

బంగారం ధర పెరగడంతో నేడు మరో వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం వెండి ధర రూ.190 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వెండి కిలో రూ.62,145కి చేరింది. క్రితం ట్రేడింగ్ సెషన్‌లో వెండి కిలో రూ.61,955 వద్ద ముగిసింది.

24

డాలర్‌తో రూపాయి మారకం విలువ 
శుక్రవారం  ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు క్షీణతతో ట్రేడవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ కూడా భారీగా పడిపోయింది. సెన్సెక్స్ ఏడు నెలల కనిష్టానికి తాకింది. దీంతో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు క్షీణించి 74.68 వద్ద ముగిసింది.
 

34

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,808 డాలర్లుగా  ఔన్స్ వెండి 23.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ ప్రకారం, బంగారం ధరల పెరుగుదలకు అనుగుణంగా కామెక్స్ ట్రేడింగ్ ఒక శాతం పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,808 డాలర్లు పలికింది. డాలర్ బలహీనపడటం, యూ‌ఎస్ బాండ్ ఈల్డ్‌లలో పతనం బంగారం ధరలను పెంచాయి.

44

గురువారం 10 గ్రాములకు రూ.195 తగ్గి రూ.46,625కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో విలువైన లోహాల ధరలు పెరగడం, రూపాయి పతనమే ఇందుకు కారణమని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ పేర్కొంది. క్రితం ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.46,430 వద్ద ముగిసింది. ఇతర విలువైన లోహాలలో స్పాట్ వెండి ఔన్సుకు  23.57 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, ప్లాటినం 1.2% పడిపోయి  983.22కి డాలర్లకు చేరుకుంది. నేడు చమురు ధరలు పడిపోయాయి యూ‌ఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 5.7% తగ్గి 73.96డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ 4.66% తగ్గి  78.38డాలర్లకి చేరాయి.  
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved