ఈ స్టాక్స్ లో విదేశీ పెట్టుబడిదారులు భారీగా ఇన్వెస్ట్ చేశారు...మీరూ ఓ లుక్కేయండి..
స్టాక్ మార్కెట్లో లాభాలు అందించే షేర్లను కొనాలంటే, చాలా హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏ కంపెనీ అయినా లాభాలు అందించాలి, అంటే ఆ కంపెనీ బిజినెస్ లాభాల్లో ఉండాలి. అప్పుడే షేర్ హోల్డర్లకు కూడా లాభాలు వస్తాయి.

ఒక కంపెనీ షేర్లు బలపడాలంటే అనేక కారణాలు ఉన్నాయి. అందులో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం కూడా ఒక కారణమే. ఎందుకంటే విదేశీ సంస్థాగత మదుపుదారులు, దేశీయ మార్కెట్లోని కంపెనీలను కూలంకషంగా స్టడీ చేసిన తర్వాతే పెట్టుబడులు పెడుతుంటారు. అలా ఇటీవల భారీగా పెట్టుబడులు పెట్టిన ఓ 5 కంపెనీల షేర్ల గురించి తెలుసుకుందాం.
దేశీయ షేర్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) వాటా దాదాపు 19%. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు కేవలం 10 స్టాక్స్లో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం 764 కంపెనీల షేర్లను కొనుగోలు చేశారు.
టాటా స్టీల్: టాటా గ్రూప్కు చెందిన ఉక్కు కంపెనీ టాటా స్టీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గరిష్టంగా పెట్టుబడులు పెట్టారు. టాటా స్టీల్లో విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.24,898 కోట్ల పెట్టుబడులు పెట్టారు. రెండో త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు కంపెనీకి చెందిన 244.42 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
భారత్ ఎలక్ట్రానిక్స్: ఈ ప్రభుత్వ కంపెనీలో రెండో త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.22,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ నవరత్న కంపెనీకి చెందిన దాదాపు 87.89 కోట్ల షేర్లను ఎఫ్ఐఐలు కొనుగోలు చేశారు.
జొమాటో: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోపై విదేశీ ఇన్వెస్టర్లు కూడా విశ్వాసం చూపించారు. రెండో త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.8,057 కోట్ల విలువైన జొమాటో షేర్లను కొనుగోలు చేశారు. విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు 139 కోట్ల జోమాటో షేర్లను కొనుగోలు చేశారు.
ఐటీసీ : హోటళ్లకు సిగరెట్ల వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ఐటీసీ కంపెనీ రూ.3,200 కోట్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. 2022లో నిఫ్టీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న స్టాక్లలో ITC కూడా ఒకటి.
బజాజ్ ఫిన్సర్వ్: విదేశీ పెట్టుబడిదారులు కూడా బజాజ్ ఫిన్సర్వ్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. రెండో త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు కంపెనీలో రూ.15,680 కోట్ల పెట్టుబడులు పెట్టారు.