MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • డిఫై 22 స్కూటర్ స్టైలిష్ లుక్ అదిరింది: ఓలా, ఏథర్‌కి పోటీ తప్పదు

డిఫై 22 స్కూటర్ స్టైలిష్ లుక్ అదిరింది: ఓలా, ఏథర్‌కి పోటీ తప్పదు

ఆటో ఎక్స్‌పో 2025: OPG మొబిలిటీ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘డిఫై 22’ ను ఆటో ఎక్స్‌పో 2025లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో ఈ స్కూటర్ అందరినీ ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరి ఆ ఫీచర్స్ ఏంటో మనమూ ఓసారి తెలుసుకుందాం రండి. 

1 Min read
Naga Surya Phani Kumar
Published : Jan 15 2025, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఆటో ఎక్స్‌పో 2025 జనవరి 17న ప్రారంభం కానుంది. ఇదే వేదికపై OPG మొబిలిటీ కంపెనీ డిఫై 22ని లాంచ్ చేస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఇలాంటి కొత్త మోడల్స్ కు ఆదరణ కూడా పెరిగేలానే ఉంది. అందుకే OPG మొబిలిటీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కచ్చితంగా ఓలా, ఏథర్ కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

24

OPG మొబిలిటీ కంపెనీకి ఇంతకు ముందు పేరు Okaya EV. పేరు మార్చిన తర్వాత ఈ కంపెనీ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. డిఫై 22 పేరుతో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆ కంపెనీ ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనుంది.

భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్ తయారైంది. అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా డిఫై 22 స్లైలిష్ లుక్, బోల్డ్ డిజైన్‌ చాలా అట్రాక్టివ్ గా ఉంది. 

 

34

డిఫై 22లో LED లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫ్యూచరిస్టిక్, స్టైలిష్ లుక్‌కి కలిగి ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఏ వర్గం వారికైనా సరిగ్గా సరిపోయే లుక్, ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. డిఫై 22 భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ MD అన్షుల్ గుప్తా చెప్పారు.

44

ఈ స్కూటర్ ముఖ్యంగా పట్టణాల్లో అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. OPG మొబిలిటీ పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఆటో ఎక్స్‌పోలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ ఆటో ఎక్స్‌పోకు జనవరి 19 నుంచి ప్రజలకు ప్రవేశం ఉంటుంది. జనవరి 18న మీడియా వాళ్లకు ముందస్తు ప్రవేశం లభిస్తుంది. ఈ ఆటో ఎక్స్‌పోలోనే డిఫై 22 ఆవిష్కరణ జరుగుతుంది.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved