MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం వస్తే పెరిగే జీతాన్ని ఇలా లెక్క వేయండి

8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం వస్తే పెరిగే జీతాన్ని ఇలా లెక్క వేయండి

8th Pay Commission: ఎనిమిదవ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఇది వచ్చే అవకాశం ఉంది. ఎనిమిదో పే కమిషన్ అమల్లోకి వస్తే జీతాలు ఎంత పెరుగుతాయో ఇలా లెక్క వేసుకోండి.  

2 Min read
Haritha Chappa
Published : Nov 05 2025, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎనిమిదో వేతన సంఘం
Image Credit : Pixabay

ఎనిమిదో వేతన సంఘం

ఎనిమిదవ వేతన సంఘానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. మంత్రివర్గం ఆ వేతన సంఘానికి సంబంధించిన నిబంధనలను కూడా ఆమోదించింది. దీంతో ఈ కొత్త వేతన సంఘం జనవరి 1, 2026ని అమల్లోకి వస్తుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వారి జీవితంలో కూడా ఎంతో పెరుగుదల ఉంటుంది.

24
ఏ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి?
Image Credit : Pixabay

ఏ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి?

ఎనిమిదో వేతన సంఘం రాగానే మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అందులో భారతీయ రైల్వే, పోస్టల్ డిపార్ట్మెంట్, కస్టమ్స్, ఆదాయపు పన్ను శాఖ వంటి పెద్ద విభాగాల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. వారికే మొదట నేరుగా జీతంలో పెరుగుదల కనిపిస్తుంది. వేతన సంఘం విడుదల అవ్వగానే వెంటనే వీరి జీతాలు పెరుగుతాయి.

Related Articles

Related image1
Ambani Assets: అంబానీ ఇల్లుతో సహా ఆస్తులన్నీ జప్తు, చివరికి తూర్పుగోదావరిలో ఉన్న స్థిరాస్తులు కూడా
Related image2
Fake Rs500 Notes: చలామణిలో భారీగా నకిలీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా చూసి తీసుకోండి
34
వీరందరికీ భారీ జీతాలు
Image Credit : Pixabay

వీరందరికీ భారీ జీతాలు

ఇక భారత సైన్యం, నేవి ఉద్యోగులు, వైమానిక దళ ఉద్యోగులు కూడా ఎనిమిదో వేతన సంఘం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందుతారు. దాదాపు దేశం కోసం పనిచేస్తున్న ప్రతి సైనికుడికి ఎనిమిదో వేతన సంఘం వల్ల లాభం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ఈ బలగాలన్నీ వస్తాయి. ఇక జీతం ఎంత పెరుగుతుంది అనేది ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పై ఆధారపడి ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలలో పనిచేసే వారికి కూడా జీతం పెరుగుదల ఉంటుంది. ఐఐఎం, ఐఐటీ వంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఇక పింఛనుదారులకు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది.

44
జీతం ఇలా లెక్క వేయండి
Image Credit : Pixabay

జీతం ఇలా లెక్క వేయండి

ఎనిమిదవ వేతన సంఘం వచ్చాక మొదట ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను నిర్ణయిస్తారు. ఇది 1.83 శాతం నుంచి 2.86 శాతం వరకు ఉంటుంది. 1.83 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చి ఉంటే ఒక ఉద్యోగి జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకోండి. ఒక ఉద్యోగి బేసిక్ జీతం 20,000 రూపాయలు అనుకుందాం. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 1.83 ఇస్తే 20,000 X 1.83 = 36,600 రూపాయలు బేసిక్ పే అవుతుంది. అదే 2.85 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఇస్తే 20,000 X 2.85 = 57000 రూపాయలు బేసిక్ పే అవుతుంది. ఇక ఈ బేసిక్ పై ఆధారంగానే హెచ్ఆర్ఏ, డిఏ వంటి అలవెన్సులు కూడా పెరుగుతాయి. దీనివల్ల ప్రతినెలా చేతికందే జీతం రెండు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంచనాల ప్రకారం ప్రతి ఉద్యోగ జీతం కనీసం 30 శాతానికి పైగా పెరుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved