MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • budget 2022: ఆర్థిక మంత్రిగా 4వసారి బడ్జెట్‌ను సమర్పించనున్న నిర్మలమ్మ.. ఈ సమస్యలపై కీలక ప్రకటన..

budget 2022: ఆర్థిక మంత్రిగా 4వసారి బడ్జెట్‌ను సమర్పించనున్న నిర్మలమ్మ.. ఈ సమస్యలపై కీలక ప్రకటన..

భారతదేశ కేంద్ర బడ్జెట్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఎప్పటిలాగానే ఈసారి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2022న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2014లో బి‌జే‌పి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 10వ బడ్జెట్ కాగా, ఆర్థిక మంత్రిగా సీతారామన్ కి నాలుగో బడ్జెట్. కోవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్,  పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య ఈ బడ్జెట్ జనాదరణ పొందుతుందని భావిస్తున్నారు. 

3 Min read
Ashok Kumar | Asianet News
Published : Jan 25 2022, 02:14 AM IST| Updated : Jan 25 2022, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
nirmala sitaraman

nirmala sitaraman

 ఆర్థికవేత్తలు, ఇండియా ఇంక్., పన్ను నిపుణులు ఇంకా జీతభత్యాల తరగతికి చెందిన వారు బడ్జెట్ 2022 నుండి ఈ 13 కీలక అంచనాలను పెట్టుకున్నారు.

1-  కరోనా కారణంగా చాలా ప్రాంతాలలో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో విద్యుత్, ఇంటర్నెట్ ఛార్జీలు, ఇంటి అద్దె, ఫర్నిచర్ మొదలైన వాటిపై వారి ఖర్చు పెరిగింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా వర్క్ ప్రోమ్ హోమ్ కింద ఇంటి నుండి పని చేసే వారికి అదనపు పన్ను మినహాయింపు ఇవ్వాలని సూచించింది. దీనిపై ఆర్థిక మంత్రి భారీ ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

2- కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ప్రజల జాబితాలో ఆరోగ్య బీమా ప్రాధాన్యత సంతరించుకుంది. బీమా నిపుణులు ఆరోగ్య కవరేజీని 5% జి‌ఎస్‌టి శ్లాబ్‌లో ఉంచాలని కోరుతున్నారు. జి‌ఎస్‌టి రేటులో ఈ మార్పు మరింత మంది ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది అలాగే ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
 

25
nirmala sitaraman

nirmala sitaraman

3-ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలంగా ఉంది. దీంతో తక్కువ వడ్డీ రేట్లకే ఎలక్ట్రిక్ వాహనాలను ఎంపిక చేసుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని  కోరుతోంది. అలాగే బడ్జెట్ డిమాండ్లకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆటోమొబైల్ రంగం సూచనలు కూడా  సమర్పించింది. 

4- కరోనా మహమ్మారితో ఎక్కువగా ప్రభావితమైన రంగంలో ఆతిథ్య రంగం(hospitality) చేర్చబడింది. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి  తీవ్రతను ఎదుర్కొంటున్న ఆతిథ్య రంగం బడ్జెట్ 2022లో పునరుద్ధరించిన జి‌ఎస్‌టి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను చూస్తోంది. అలాగే రేస్టారెంట్ వ్యాపారాన్ని  మరో లాక్‌డౌన్ నుండి రక్షించే వ్యవస్థను ఈ రంగం కోరుకుంటుంది. బ్యాంకులు, ఎన్‌బి‌ఎఫ్‌సిలు ఇచ్చే రుణాలపై నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ 100% క్రెడిట్ గ్యారెంటీని కలిగి ఉన్న ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌కు అనుగుణంగా బ్యాంకులు ఇంకా ఎం‌ఎస్‌ఎం‌ఈ పరిశ్రమ రంగాలు మద్దతును కోరుతున్నాయి.

35

6-నిర్మలా సీతారామన్  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డబ్బును ప్రవహించేలా ఎఫ్‌ఎంసిజి రంగం ఆకాంక్షిస్తోంది. ఈ రంగం తరపున వివిధ అంశాలను చర్చించిన తర్వాత, దాని సూచనలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపారు. దీనిపై ఆర్థిక మంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తారని భావిస్తోంది. 

7- విమానయాన పరిశ్రమ కనీసం 2 సంవత్సరాల పాటు పన్ను మినహాయింపు ఇంకా కనీస ప్రత్యామ్నాయ పన్నును నిలిపివేయాలని ఆశిస్తోంది. అదనంగా, కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న విమానయాన సంస్థలు కూడా కనీస ప్రత్యామ్నాయ పన్నును నిలిపివేయాలని కోరుతున్నాయి. కరోనా మహమ్మారి విమానయాన రంగానికి కూడా భారీ నష్టం కలిగించింది. 

8- స్టాక్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా బడ్జెట్‌పై గొప్ప అంచనాలను పెట్టుకున్నాయి. సెక్యూరిటీల లావాదేవీల పన్నును తగ్గించాలని వారు కోరుతున్నారు. ఆర్థిక మంత్రి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT)ని రద్దు చేయాలని లేదా తగ్గించాలని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

45
nirmala sitaraman

nirmala sitaraman

9-క్రిప్టోకరెన్సీల పట్ల ప్రజల ఆదరణ నిరంతరం పెరుగుతోంది. భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్ల సంఖ్య కూడా రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. దీంతో క్రిప్టో బిల్లు ముసాయిదాను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.  దీంతో దేశీయ క్రిప్టో ఇంకా బ్లాక్‌చెయిన్ స్టార్టప్ టాక్సేషన్, చట్టాలు, మినహాయింపులు అలాగే నిబంధనలు వంటి సమస్యలపై ప్రజలు స్పష్టత కోరుకుంటున్నారు.

10- ఇండస్ట్రీ బాడీ ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ స్టార్టప్‌లకు కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో చిన్న వ్యాపారాలకు మరింత సహకారం అందించడం ద్వారా వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు, అదనపు స్టార్టప్ అనుకూల విధానాలు ఇంకా పన్ను రాయితీలను ప్రభుత్వం ప్రోత్సహించాలని స్టార్టప్‌లు డిమాండ్ చేస్తున్నాయి.

55

11-వాతావరణ మార్పులు ఎప్పటికప్పుడు మారడంతో భారతదేశ పునరుత్పాదక రంగం పెట్టుబడి ఆధారిత పన్ను ప్రోత్సాహకాల కోసం చూస్తోంది. అలాగే వారు ఆర్&డి, సాంకేతికత స్వీకరణ, స్టోరేజ్ విభాగంలో పెట్టుబడి కోసం ప్రోత్సాహకాల కోసం చూస్తున్నారు.

12 - ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50,000 నుండి కనిష్టంగా రూ. 75,000కి ఇంకా గరిష్టంగా రూ. 1 లక్ష వరకు పెంచాల్సిన అవసరం కూడా బడ్జెట్ 2022 నుండి ఒక అంచనా. దీన్ని పెంచాలని జీతాలు ఆశిస్తున్నారు. దీన్ని పెంచడం ద్వారా జీతాలు తీసుకునే వ్యక్తులు నేరుగా పన్ను నుండి ప్రయోజనం పొందుతారు.

13- ఈసారి కూడా దేశ ఆర్ధిక బడ్జెట్‌ను కరోనా మహమ్మారి నీడలో సమర్పించబోతున్నారు. కోవిడ్-19లో పెరుగుతున్న అసమానతలను పరిష్కరించడానికి ఈసారి రెవెన్యూ పన్ను, వారసత్వపు పన్నును మళ్లీ ప్రవేశపెట్టాలని నిపుణులు భావిస్తున్నారు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Recommended image2
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image3
Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved