MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • budget 2022: మరో వారం రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రకటన.. తేదీ, సమయం నుండి పూర్తి సమాచారం ఇదే..

budget 2022: మరో వారం రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రకటన.. తేదీ, సమయం నుండి పూర్తి సమాచారం ఇదే..

భారతదేశపు మొట్టమొదటి ఫుల్ టైమ్ మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది రోజుల్లో అంటే  1 ఫిబ్రవరి  2022న దేశ  బడ్జెట్‌ను సమర్పించనున్నారు. దీని ద్వారా ఆర్థిక అకౌంటింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : Jan 25 2022, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి 2022 బడ్జెట్ 10వ బడ్జెట్ కాగా, 2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న  నాలుగో బడ్జెట్ ఇది. 

25

జనవరి 31న ఆర్థిక సర్వే
బడ్జెట్‌ సమర్పించే ఒకరోజు ముందు అంటే జనవరి 31న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ  ఆన్యువల్ డాక్యుమెంట్, ఫైనాన్షియల్ సర్వే గత ఆర్థిక సంవత్సరంలో దేశ  ఆర్థిక అభివృద్ధిని సమీక్షిస్తుంది. అంటే పారిశ్రామిక, వ్యవసాయం, తయారీ తదితర అన్ని రంగాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. విశేషమేమిటంటే, భారతదేశంలో మొదటి ఆర్థిక సర్వే 1950-51 సంవత్సరంలో సమర్పించారు. 1964 నాటికి బడ్జెట్, ఆర్థిక సర్వే ఒకేసారి సమర్పించబడ్డాయి.  ఆ తరువాత విడిగా ప్రవేశపెట్టారు.
 

35

రెండు దశల్లో   బడ్జెట్ సమావేశాలు 
 భారత ఆర్థిక సర్వే సమర్పించే తేదీ, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఒకేరోజున ప్రారంభమవుతాయి. జనవరి 31న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో  ప్రారంభమవుతుంది. మొదటి దశ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత, రెండవ సెషన్ కోసం ప్యానెల్ మార్చి 14న తిరిగి సమావేశమై ఏప్రిల్ 8 వరకు  ఉంటుంది.

45

2022 బడ్జెట్‌పై  ఆశలు 
ప్రతిసారీలాగే ఈసారి కూడా బడ్జెట్ 2022పై దేశంలోని సాధారణ, వర్గాల ప్రజలలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కోవిడ్-19  థర్డ్ వేవ్‌తో భారతదేశం పోరాడుతున్నందున ఆర్థికవేత్తలు, జీతభత్యాలు పొందేవారు, పరిశ్రమ నిపుణులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్ అనంతర జి‌డి‌పి అంచనా  ఉంటుంది. లాక్‌డౌన్,  కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా 2020-21లో భారతదేశ జి‌డి‌పి పడిపోయింది.
 

55

బడ్జెట్ గురించి ముఖ్యమైన వాస్తవాలు
1- దేశ యూనియన్ బడ్జెట్‌ను ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేస్తుంది. 
2- 2017 వరకు రైల్వే బడ్జెట్ ని బడ్జెట్ నుండి విడిగా సమర్పించేవారు, కానీ ఆ తరువాత కలిసి సమర్పించడం ప్రారంభమైంది. 
3- 2017 నుండి ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పించడం ప్రారంభమైంది, అంతకుముందు ఫిబ్రవరి చివరిలో ప్రవేశపెట్టేవారు. 
4- బడ్జెట్ ప్రసంగం  సగటున 90 నిమిషాల నుండి 120 నిమిషాల వరకు ఉంటుంది.
5-  నిర్మలా సీతారామన్ గత ఏడాది  2021-22లో 160 నిమిషాల పాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు.
6- నిర్మలా సీతారామన్ కంటే ముందు జస్వంత్ సింగ్ 135 నిమిషాలతో 2003లో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు.
7-  1977లో హిరూభాయ్ ఎం పటేల్ 800 పదాలతో అతి చిన్న ప్రసంగం చేశారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved