MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Air India: రూ.599కే విమానం ఎక్కేయొచ్చు.. ఎయిర్ ఇండియా ఆఫర్ అదుర్స్ అంతే!

Air India: రూ.599కే విమానం ఎక్కేయొచ్చు.. ఎయిర్ ఇండియా ఆఫర్ అదుర్స్ అంతే!

Air India: దేశ ప్రజలకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.599 రూపాయలకే ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టిక్కెట్లను అందిస్తోంది. విమానంలో ప్రయాణించాలన్న మధ్య తరగతి వారి కలను నెరవేర్చాలన్న సంకల్పంతోనే ఈ టికెట్లు విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. మరి ఇంత తక్కువ ధరకు ఏ రూట్లలో ప్రయాణించవచ్చో తెలుసుకుందామా? 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 18 2025, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇండియాలో విమానంలో ప్రయాణించాలని అందరికీ ఉంటుంది. ధనవంతులు ఈజీగా ఫ్లైట్ ఎక్కేయగలరు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించగలరు. కాని మధ్యతరగతి వాళ్లు విమానం ప్రయాణించాలని అనుకుంటారని, వారి కలను నెరవేర్చడం తమ బాధ్యత అని టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా భావించింది. అందుకే తక్కువ ధరకే ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టిక్కెట్లను అమ్ముతోంది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ప్రీమియం ఎకానమీ టికెట్ ధరను కేవలం రూ. 599 నుంచి స్టార్ట్ చేసింది. ఇది సాధారణ ఎకానమీ ఫేర్ కంటే తక్కువ. ఈ ఆఫర్ రూట్, డిమాండ్‌ను బట్టి మారుతుంది. ఇండియాలో ప్రీమియం ఎకానమీని అందించే ఏకైక ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియానే కావడం విశేషం.

ఈ రూ. 599 ఆఫర్‌ను ఉపయోగించుకొని టికెట్ తీసుకున్న వారు ఎయిర్ ఇండియాకు చెందిన 39 డొమెస్టిక్ రూట్లలో ఏదైనా ఒక రూటులో ప్రయాణించవచ్చు.

 

34

వారానికి 50,000 సీట్లు

మధ్య తరగతి వారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేయాలని ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. వారానికి 50,000 సీట్లను డిస్కౌంట్ ధరకు విక్రయించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఇప్పుడు ప్రీమియం ఎకానమీ సీట్లను 30% పెంచారు. దీంతో డిస్కౌంట్ ధరల్లో ప్రీమియం ఎకానమీ సీట్ల సంఖ్య వారానికి 65,000 దాటుతుంది. వీటిలో 34,000 సీట్లు మెట్రో నగరాల మధ్య ఉన్నాయి.

 

44

ఏఏ రూట్లలో ప్రయాణించొచ్చు

ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ రూట్లలో రూ. 599 నుంచి ఆఫర్ ధరతో ప్రీమియం ఎకానమీలో ప్రయాణించవచ్చు.

ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ కూడా ఇస్తోంది. ఫ్రీగా సీట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్-ఇన్, బోర్డింగ్, లగేజీకి ప్రయారిటీ కూడా ఉంటుంది.

ఇది కూడా చదవండి తక్కువ ఖర్చుతో ప్రపంచంలో చూడదగ్గ టాప్ 10 ప్రదేశాలు ఇవే

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
సొంతంగా ఏం లేవు కానీ కోట్లు సంపాదిస్తున్నాయి.. నిజంగా ఈ కంపెనీల స‌క్సెస్ సీక్రెట్ వండ‌ర్
Recommended image2
మారేది క్యాలెండ‌ర్ పేజీ మాత్ర‌మే కాదు, నిబంధ‌న‌లు కూడా.. జూలై 1 నుంచి గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు
Recommended image3
ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved