MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • 7th పే కమిషన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు, పెన్షన్‌ పెంపు..?

7th పే కమిషన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పదవీ విరమణ వయస్సు, పెన్షన్‌ పెంపు..?

కేంద్రంలోని నరేంద్ర మోదీ(narendra modi) ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును, వారికి వచ్చే పెన్షన్ (pension)మొత్తాన్ని పెంచనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్ (UPS) ఆర్థిక సలహా కమిటీ ప్రధానికి ప్రతిపాదన కూడా పంపింది.

Ashok Kumar | Asianet News | Published : Nov 23 2021, 06:38 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

ప్రతిపాదన ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని సిఫార్సు చేసింది. దీనితో పాటు సార్వత్రిక పెన్షన్ విధానాన్ని కూడా ప్రారంభించాలని కమిటీ కోరింది.  
 

24
Asianet Image

ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చ
సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోతైన సమాలోచనలో ఉంది. ఈ ప్రతిపాదనలో దేశంలోని సీనియర్ సిటిజన్ల భద్రతకు మెరుగైన ఏర్పాట్లను ఆర్థిక సలహా కమిటీ సిఫార్సు చేసింది. అలాగే సీనియర్ సిటిజన్లకు కనీసం నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వాలని సూచించారు. పని చేసే వారి జనాభా పెరగాలంటే అందుకు పదవీ విరమణ వయస్సును తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది. సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఇలా చేయవచ్చు. 

34
Asianet Image

స్కిల్ డెవలప్‌మెంట్‌పై కమిటీ సూచనలు 
కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో.. స్కిల్ డెవలప్‌మెంట్ జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విధానాలను రూపొందించాలని పేర్కొంది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల నైపుణ్యాభివృద్ధిని నివేదిక సూచిస్తుంది. ఈ ప్రయత్నంలో అసంఘటిత రంగంలో నివసిస్తున్న వారు, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, శరణార్థులు, వలసలు, శిక్షణ పొందే స్తోమత లేని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.

44
Asianet Image

దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య 
ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2050 నాటికి దేశంలో దాదాపు 32 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉంటారు. అలాగే  2019 సంవత్సరంలో భారతదేశ జనాభాలో కేవలం 10 శాతం లేదా 140 మిలియన్ల మంది మాత్రమే సీనియర్ సిటిజన్ల వర్గంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. 

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories