2025లో ఈ రాశివారికి జాక్పాట్.. అదృష్టం బాగా కలిసొస్తుంది
మళ్లీ కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అయితే ఈ కొత్త సంవత్సరంలో 2025 లో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది. వారు ఏది అనుకుంటే అది జరుగుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
2024 సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్పేసి 2025 సంవత్సరానికి వెల్ కం చెప్పే టైం దగ్గర్లోనే ఉంది. అయితే జ్యోతిష్యం ప్రకారం.. ఈ 2025 సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగుండబోతోంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ ఏడాది అదృష్టం బాగా కలిసొస్తుంది. వీరికి త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే?
కన్య రాశి వారు
కన్యరాశివారు 2024 కంటే 2025 లోనే చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ల లైఫ్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి రోజులు ప్రారంభమవుతాయి. అనుభవజ్ఞులైన వారి మద్దతు వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు కొత్త ఏడాదిలో పూర్తవుతాయి. అలాగే ప్రేమలో ఉన్న అడ్డంకి పూర్తిగా తొలగిపోతుంది. వీరికి కొత్త సంవత్సరంలో ధనలాభంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు కూడా పొందుతారు.
కర్కాటక రాశి
2025 కొత్త సంవత్సరం మొదట్లో ఈ రాశివారిపై శని ప్రభావం ఉంటుంది. అయితే ఇది మార్చి 28 నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత ఈ రాశివారి సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తగ్గుతాయి. కోర్టులో కేసులో కూడా వీరు విజయం సాధిస్తారు. దీంతో వీరు ఆశించినవన్నీ పొందుతారు. ఆరోగ్య సమస్యల కూడా తగ్గుతాయి.
మకర రాశి
మకరరాశివారిపై కూడా కొత్త సంవత్సరం మొదట్లో శని ప్రభావం ఉంటుంది. ఇది మార్చి 28, 2025న ముగుస్తుంది. ఆ తర్వాత ఈ రాశివారికన్నీ శుభ దినాలే. ఈ రాశివారికి ధనలాభంతో పాటు ఎన్నో ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ రాశివారు ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. అలాగే పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందుతారు. వ్యాపారం, ఉద్యోగులకు ఈ ఏడాది బాగుంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారిపై 2025 మార్చి 28 వరకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ముగిసిన వెంటనే ఈ రాశి వారికి శుభ ఘడియలు మొదలవుతాయి. లవ్ లైఫ్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతారు. రాజకీయంలో ఉన్నత పదవి పొందుతారు.ప్రణాళికాబద్ధంగా పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తారు.