- Home
- Astrology
- Gold Price: బంగారం ధర విషయంలో ఈ జోతిష్కుడు చెప్పిందే నిజమైంది.. తులం బంగారం ఎంతకు చేరుతుందంటే..
Gold Price: బంగారం ధర విషయంలో ఈ జోతిష్కుడు చెప్పిందే నిజమైంది.. తులం బంగారం ఎంతకు చేరుతుందంటే..
Gold Price: జనవరిలో బంగారం ధర తగ్గుతుందని ప్రముఖ జోతిష్యుడు చెప్పిన జోస్యం నిజమైంది. మరి, రాబోయే రోజుల్లో పసిడి ధర ఎంత తగ్గుతుందో.. తులం బంగారం ఎంతకు చేరే అవకాశం ఉందో చూద్దాం..

భారీగా పడిపోతున్న బంగారం ధరలు..
ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఈ ఉద్రిక్తతల కారణంగా… బంగారం ధర మరింత పెరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకోకుండా బంగారం ధరలు అమాంతం పడిపోవడం మొదలయ్యాయి. ఎంసీ ఎక్స్ మార్కెట్ లో బంగారం ధర 7.5 శాతం వరకు పతనం అయ్యింది.
పసిడి ధర పడిపోతుందని ముందే అంచనా..
ప్రముఖ జోతిష్కుడు ప్రశాంత్ కిణి 2026లో బంగారం ధర ఎలా మారబోతున్నాయో ముందే అంచనా వేశారు. 2026 జనవరిలో బంగారం ధర ఆకాశాన్ని తాకుతున్న సమయంలో నే పసిడి ధర తగ్గుతుందని ప్రశాంత్ కిణి చెప్పారు. తులం బంగాం రూ.11వేల నుంచి 12 వేల వరకు తగ్గుతుందని ఆయన చెప్పిన మాటే నిజమైంది. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత తగ్గుతుందని ఆయన చెబుతున్నారు.
భవిష్యత్తులో బంగారం ధర ఎంతకు చేరుతుంది?
రాబోయే నెలల్లో బంగారం ధర గురించి కూడా ప్రశాంత్ కిణి తన అంచనా చెప్పారు. ఆయన ప్రకారం, పసిడి ధర చాలా వరకు స్థిరంగా ఉంటుంది. 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 11,000 నుంచి 12,000 రూపాయల మధ్య స్థిరపడుతుందని, పెద్దగా మార్పులు ఉండవని ఆయన అంచనా వేశారు.
అమెరికా విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 'అమెరికన్లు తలుచుకుంటే బంగారం ధరను పాతాళానికి తొక్కేయగలరు' అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ఆకాశాన్నంటిన బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,640 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,670గా ఉంది. ఇక గ్రాము వెండి ధర రూ.235గా నమోదైంది.

