చంద్రబాబు టార్గెట్ రోజా: నగరి టీడీపీ అభ్యర్థి వీరీలో ఒకరు
చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్ధులను చంద్రబాబునాయుడు ఫైనల్ చేశారు. వైసీపీ ఫైర్బ్రాండ్ రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి టీడీపీ ఇంత వరకు ఎవరిని అభ్యర్థులుగా ఫైనల్ చేయలేదు
పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్ధులను చంద్రబాబునాయుడు ఫైనల్ చేశారు. వైసీపీ ఫైర్బ్రాండ్ రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి టీడీపీ ఇంత వరకు ఎవరిని అభ్యర్థులుగా ఫైనల్ చేయలేదు.
ఈ సీటుపై మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యుల్లో ఏకాభిప్రాయానికి రాలేదు.దీంతో బుధవారం నాడు నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలతో బాబు మరోసారి సమావేశం కానున్నారు.
చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక కోసం బాబు మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు.చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కుప్పం నుండి మరోసారి బాబు బరిలోకి దిగనున్నారు. పలమనేరు నుండి మంత్రి అమర్నాథ్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. చిత్తూరు ఎంపీ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ ఎన్.శివప్రసాద్ మరోసారి బరిలోకి దిగనున్నారు.
ఈ మూడు అసెంబ్లీ స్థానాలను మినహాయిస్తే మిగిలిన పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి, చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్ధులను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. పలమనేరు నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా అమర్నాథ్ రెడ్డి పోటీ చేశారు. బోస్పై అమర్ నాథ్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికలకు ముందే అమర్ నాథ్ రెడ్డి టీడీపీని వీడీ వైసీపీలో చేరారు.
ఎన్నికల తర్వాత అమర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. బాబు తన మంత్రివర్గంలోకి అమర్నాథ్రెడ్డిని తీసుకొన్నారు. చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లో సత్యప్రభ పేరు దాదాపుగా ఫైనల్ చేశారు. పోటీకి సత్యప్రభ దూరంగా ఉంటానని చెబితేనే పార్టీ నాయకత్వం మరొకరి పేరును పరిశీలించే అవకాశం ఉంటుంది.
పూతలపట్ట అసెంబ్లీ సెగ్మెంట్పై చంద్రబాబునాయుడు కొంత కసరత్తు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పూతలపట్టు సీటులో లలితకుమారితో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రవి, సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్ తదితరులు ఈ సీటును ఆశిస్తున్నారు. పలమనేరు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న లలితకుమారి వైపు చంద్రబాబునాయుడు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడ లలిత కుమారికి మద్దతుగా ఉన్నారని చెబుతున్నారు.
గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచార్జీ హరికృష్ణ, తనూజల మధ్య పోటీ నెలకొంది. మాజీ మంత్రి కుతూహలమ్మ కొడుకు హరికృష్ణ కావడం ఆయనకు కలిసివచ్చింది. తనూజ వెంట నేతలు ఉన్నా...క్యాడర్ అంతా హరికృష్ణకు జై కొడుతున్నారు. అయితే ఈ సీటు విషయంలో బాబు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఇక నగరి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేసే టీడీపీ అభ్యర్ధిని చంద్రబాబునాయుడు ఇంకా ఎంపిక చేయలేదు. నగరి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు పెద్ద కొడుకు భానుప్రకాష్ టిక్కెట్టు ఆశిస్తున్నాడు.
అయితే ఆయనకు తల్లి సరస్వతమ్మ, చిన్న కొడుకు జగదీష్ వ్యతిరేకంగా ఉన్నారు. మరోవైపు సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజీల ఛైర్మెన్ కొండూరు ఆశోక్ రాజు ఈ స్థానం నుండి టికెట్టును ఆశిస్తున్నాడు.
గాలి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి, ఆమె చిన్న కొడుకు సహా నియోజకవర్గంలోని మెజారిటీ నేతలంతా రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ స్థానంలో వైసీపీ అభ్యర్ధిగా రోజా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లోనే రోజా తొలిసారిగా ఈ స్థానం నుండి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై విజయం సాధించారు.