జగన్ .. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావ్ : లిక్కర్ బ్రాండ్లపై మందుబాబు ఫైర్...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయంటూ ట్విట్టర్ వేదికగా ఓ ఔత్సాహికుడు తన నిరసన తెలిపాడు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయంటూ ట్విట్టర్ వేదికగా ఓ ఔత్సాహికుడు తన నిరసన తెలిపాడు.
ఐయామ్ పీకేఫానటిక్ అనే అకౌంట్ నుండి నా జీవితాన్ని నాశనం చేశావు.. వైస్ జగన్ అంటూ తన బాధను వెళ్లగక్కాడు.
2018 తరువాత ఏపీలో బ్రాండ్లు ఊరూ, పేరూ లేని మద్యం బ్రాండ్లు దొరుకుతున్నాయని, వాటిని తాగితే ఆరోగ్యం ఎలా పాడవుతుందో తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు.
వీటిని తాగడం వల్ల చెస్ట్ లో వాటర్ ఫాం అయ్యి తాను ఐదు రోజుల పాటు హాస్పిటల్ పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.
దీనికి నెటిజన్లనుండి రకరకాల సమాధానాలు వచ్చాయి. ఒకతనైతే రీసెంట్ గా రెండుసార్లు బ్రిటిష్ ఎంపైర్ బీర్ తాగానని వెంటనే ఛాతిలో ఏదో అనీజీనెస్ వచ్చిందని వాపోయాడు.
ఇక మరొకరు ఇప్పడు ఏపీలో దొరుకుతున్న కొత్త మందు బ్రాండ్లను ట్రై చేయకపోవడమే మంచిదని చెప్పుకొచ్చారు.