MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ప్రియుడి సాయంతో భర్తకు మద్యం తాగించి.. రైలు పట్టాలపై పడుకోబెట్టి హత్య.. యాక్సిడెంట్ గా చిత్రీకరించి.. చివరికి.

ప్రియుడి సాయంతో భర్తకు మద్యం తాగించి.. రైలు పట్టాలపై పడుకోబెట్టి హత్య.. యాక్సిడెంట్ గా చిత్రీకరించి.. చివరికి.

భర్త నిత్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని ఓ భార్య ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చింది. తరువాత దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలనుకుంది. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 10 2023, 08:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రియుడి సహాయంతో ఓ మహిళ కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేయించింది. మంత్రాలయం మండలం మాధవరంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను  ఆదివారం మంత్రాలయం ఎస్సై వేణుగోపాల రాజు, మాధవరం ఎస్ఐ  కిరణ్ లు వెల్లడించారు. మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణ (35) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రోజులాగే నిరుడు జూన్ 30వ తేదీన కూడా కూలీ పనులకు వెళ్లిన నారాయణ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య ఉప్పర వరలక్ష్మి భర్త కనిపించడం లేదంటూ మాధవరం పోలీస్ స్టేషన్లోలో ఫిర్యాదు చేసింది. దీనిమీద మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆ తర్వాత భార్య సెల్ఫోన్ కాల్ డాటా వివరాలను సేకరించారు. అందులో అనుమానితుల జాబితాను తయారు చేసుకుని వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

36

నారాయణకు మద్యం సేవించే అలవాటు ఉంది. రోజు మద్యం తాగి వచ్చి భార్య మీద అనుమాన పడుతూ ఉండేవాడు. అంతే కాదు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడు.  ఇవన్నీ విచారణలో వెలుగు చూశాయి. భర్త ఈ ప్రవర్తనతో విసిగిపోయింది భార్య వరలక్ష్మి. ఈ క్రమంలో ఆమెకు సి. బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన చిన్న గోవిందుతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

46
आगरा के सदर थाना क्षेत्र की रहने वाली महिला की शादी साल 2017 में दिल्ली के एक युवक से हुई थी। उनका एक बेटा भी है।

आगरा के सदर थाना क्षेत्र की रहने वाली महिला की शादी साल 2017 में दिल्ली के एक युवक से हुई थी। उनका एक बेटा भी है।

ఆ తర్వాత భర్తను అంతం అందించాలని నిర్ణయించుకుంది. ప్రియుడుతో కలిసి పక్కా ప్రణాళిక వేసింది. దీని ప్రకారమే చిన్న గోవిందు.. నారాయణను కర్నూలుకు తీసుకువెళ్లాడు. అక్కడ మద్యం తాగించాడు. ఆ తర్వాత మద్యంమత్తులో ఉన్న అతనిని రైలు పట్టాల మీదికి తీసుకువెళ్లి.. అక్కడ పడుకోబెట్టాడు. వారు అనుకున్నట్టుగానే  రైలు నారాయణ మీది నుంచి దూసుకుపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని ఆ తర్వాత చిన్న గోవిందు వరలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. 

56
train

train

కాగా వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. నారాయణ చనిపోయిన తర్వాత వరలక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసుల విచారణలో వరలక్ష్మి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

66

దీంతో చిన్న గోవిందు, వరలక్ష్మి.. నారాయణను తామే హత్య చేయించినట్లుగా ఒప్పుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి ఎమ్మిగనూరు న్యాయస్థానంలో హాజరపరిచారు.. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
Recommended image2
Now Playing
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu
Recommended image3
Free Bus: ఉచిత బ‌స్సు ప‌థ‌కం ఆగిపోనుందా.? అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved