MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • సినీ నటీమణులు టీడీపీ నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారు?

సినీ నటీమణులు టీడీపీ నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారు?

టీడీపీ నుంచి నటీమణులు ఎందుకు వెళ్లిపోతున్నారు. జయప్రద, జయసుద, కవిత, రోజా మొదలు దివ్యవాణి వరకు పార్టీ నుంచి వెళ్లిపోయారు. రోజా అయితే.. వైసీపీలో చేరి ఇప్పుడు మంత్రి బాధ్యతలు చేపట్టే స్థాయికి వెళ్లారు. టీడీపీలోనే వీరు ఎందుకు ఇమడలేకపోయారు? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్నది. 

2 Min read
Author : Mahesh K
| Updated : Jun 02 2022, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సినీ హీరోయిన్లు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయితే.. అందరూ వారిని ప్రత్యేకించి చూస్తుంటారు. లైమ్‌లైట్‌లో రాణించిన ఈ నటీమణులు రాజకీయ క్షేత్రంలో నెగ్గుకువస్తారా? అనే అనుమానాలు మొదటి నుంచీ ఉంటాయి. వారు ఏ చిన్న పని చేసినా.. ఏ చిన్న పొరపాటు చేసినా అది పెద్ద చర్చగా మారుతుంది. అదీగాక, రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే బలమైన సవాళ్లను ధైర్యంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సొంత పార్టీలోనూ ముసలం పెట్టే మహానుభావులూ ఉండే ఉంటారు. రాజకీయాల్లో నటీమణుల గురించిన చర్చ టీడీపీకి దివ్యవాణి రాజీనామాతో మరోసారి ముందుకు వచ్చింది. అందులోనూ టీడీపీలోనే నటీమణులు ఎందుకు ఇమడలేకపోతున్నారు? వారు ఎందుకు వరుసపెట్టి పార్టీని వీడుతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది.

టీడీపీ నుంచి చాలా మంది సినీ నటీమణులు బయటకు వెళ్లారు. జయప్రద, జయసుధ, రోజా, కవితలు టీడీపీ వీడి వెళ్లిపోయారు. తాజాగా, దివ్యవాణి కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి రాజీనామా చేశారు. 

ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1994లో ఆమె టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత కూడా ఆమె రాజ్యసభ సభ్యురాలిగా, మహిళా విభాగం నాయకురాలిగా సేవలు అందించారు. కానీ, పార్టీలో విభేదాల కారణంగా ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్లారు. తన రాజకీయాలను ఏకంగా ఏపీ నుంచి యూపీకి మార్చుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

జయసుధ 2019లో టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు. సికింద్రాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేసిన ఆమె ా తర్వాత 2016లో టీడీపీలోకి చేరారు. కానీ, స్వల్ప కాలంలోనే ఆమె పార్టీ మారారు. పార్టీ మారడానికి గల కారణాలను వివరిస్తూ టీడీపీలో తనకు సరైన గైడెన్స్ లభించలేదని చెప్పారు. కవిత కూడా టీడీపీకి బైబై చెప్పేసి బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

35
roja

roja

ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం ఎక్కడున్న తనదైన శైలిలో ప్రత్యర్థులను వణికించింది. టీడీపీలోనూ ఆమె క్రియాశీలక పాత్ర పోషించారు. 1999లో టీడీపీలో చేరిన ఆమె తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేశారు. టీడీపీ పార్టీపై 2009లో ఎన్నికల బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. వైసీపీ పార్టీ స్థాపించగానే ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పేసీ జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేరారు. వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. ఇప్పుడు రాష్ట్రమంత్రి.

45

అయితే, టీడీపీ నుంచి నటీమణులు బయటకు వెళ్లిపోతున్నా.. చాలా మంది కారణాలను బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, కొందరు కుండబద్దలు కొట్టారు. యామిని సాదినేని టీడీపీపై తీవ్ర విమర్శలు చేసి పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆమె నటి కాకున్నా.. టీడీపీలో మహిళలు సరైన గుర్తింపు పొందలేకపోతున్నారని వెల్లడించారు. సొంతపార్టీ వారే తనపై నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. తన సెల్ఫ్ రెస్పెక్ట్‌పై దాడి చేస్తున్నారని పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు.
 

55

ప్రస్తుతం దివ్యవాణి కూడా ఇదే విధమైన వివరణలు చెబుతూ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని, కనీసం ప్రెస్ మీట్ పెడదామనకున్నా సహకరించేవారు లేరని బాధపడ్డారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ పార్టీకి రాజీనామా చేశారు.

అయితే, వీరంతా పార్టీలోని కొందరు నేతల పట్ల విమర్శలు, ఆరోపణలు చేశారు. కానీ, చంద్రబాబు నాయుడిపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయలేదు. పార్టీలోనే ఆయన తర్వాతి స్థానాల్లోని కొందరు నేతల దుష్ప్రవర్తనే ఈ నటీమణులు నిష్క్రమణలకు కారణం అవుతున్నదేమోనని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతేకాదు, ఈ లోపాలను టీడీపీ సరిదిద్దుకుంటుందని ఆశించాయి.

About the Author

MK
Mahesh K

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Recommended image2
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Recommended image3
Now Playing
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved