- Home
- Andhra Pradesh
- షర్మిల త్వరలో కాంగ్రెస్ లోకి.. వైఎస్ఆర్ బిడ్డగా ఆహ్వానిస్తాం : కేవీపీ రామచంద్రరావు..
షర్మిల త్వరలో కాంగ్రెస్ లోకి.. వైఎస్ఆర్ బిడ్డగా ఆహ్వానిస్తాం : కేవీపీ రామచంద్రరావు..
వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ లో చేరుతుందని తమకు సమాచారం ఉందని.. ఆమెను ఆహ్వానిస్తాం అని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు.

అమరావతి : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని తమకు సమాచారం అందిందని తెలిపారు.
ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన అక్కడ కాసేపు విలేకరులతో మాట్లాడారు.
‘కాంగ్రెస్ వాదిగా.. కాంగ్రెస్ నేత అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల పార్టీలోకి రావడానికి ఆహ్వానిస్తున్నాను. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంచేయడం కోసం రాహుల్ గాంధీకి సహకరిస్తాం. స్థానిక పరిస్థితుల గురించి రాహుల్ కు వివరిస్తాం. 2024 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం’ అని కేవీపీ చెప్పుకొచ్చారు.
2018 ఎన్నికల్లో తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాం.. ఈ పొత్తు వల్ల కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. ఈసారి ఏపీలో కాంగ్రెస్ పార్టీని.. ఇటుక ఇటుకా పేర్చి అభివృద్ధి చేస్తున్నాం.
విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి చేయకుండా వైసిపి టిడిపిలు నిర్లక్ష్యం చేస్తున్నాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం..ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయాలను ప్రజలు గుర్తిస్తున్నారు’ అని కెవిపి పేర్కొన్నారు.